హైదరాబాద్ లోని నాచారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐస్ క్రీమ్ తిని సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. స్విగ్గీలో స్కూబ్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన సంపత్.. కేజీ ఐస్ క్రీమ్ లో కొద్దిగా ఉంచి మిగతాది మొత్తం తినేశాడు సంపత్. అయితే ఆ ఐస్ క్రీమ్ తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఇక పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు సంపత్. దీంతో సంపత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సంపత్ బంధువుల సమాచారంతో.. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. సంపత్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.