World Record Doctor: ఒక్క రూపాయి వైద్యుడిగా వరల్డ్ రికార్డు సృష్టించి.. నిన్న ఈ లోకాన్నే వదిలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Record Doctor: సుషోవన్ బంద్యోపాధ్యాయ్ పశ్చిమ బెంగాల్కి చెందిన ఫేమస్ డాక్టర్. దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ కాలం ఒక్క రూపాయికే వైద్యం అందించిన అరుదైన డాక్టర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువ మంది రోగులకు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అంతకుమించి నిరుపేదల గుండెల్లో చిరంజీవిలా చెక్కుచెదరని స్థానం సంపాదించారు. రాజకీయ నాయకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 1984లో బోల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యుడిగా, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. అనంతరం పాలిటిక్స్ నుంచి తప్పుకొని బడుగు, బలహీనవర్గాలకు వైద్యం అందించటానికే జీవితాన్ని అంకితం చేశారు. వైద్య, రాజకీయ రంగాల్లో ఆయన ప్రజలకు చేసిన నిస్వార్ధ సేవకు గాను కేంద్ర ప్రభుత్వం 2020లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 84 ఏళ్ల వయసులో ఆయన నిన్న మంగళవారం కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వన్ రూపీ డాక్టర్గా ప్రసిద్ధి చెందిన సుషోవన్ బంద్యోపాధ్యాయ్ రెండేళ్ల నుంచి మూత్రపిండ సంబంధ అనారోగ్య సమస్యలతో పోరాడారు.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
read more: Commonwealth Games: తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది. తెచ్చే పతకాలెన్నో..
ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని చెప్పారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు. “మానవత్వానికి, విశాల హృదయానికి నిలువెత్తు నిదర్శనం బంద్యోపాధ్యాయ్. ఒక్క రూపాయి వైద్యుడిగా ఆయన వేలాది మందికి అందించిన నిరుపమాన సేవలు అజరామరం. పద్మ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా బంద్యోపాధ్యాయ్తో మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే ఉన్నాయి.
ఆయన ఈ లోకాన్ని శాశ్వతంగా వీడటం నన్నెంతగానో బాధించింది. బంద్యోపాధ్యాయ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బంద్యోపాధ్యాయ్ ఇక లేరనే వార్త వినగానే మనసు ఒక్కసారిగా చలించిపోయిందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ‘ప్రజల కోసమే, ప్రజలతోనే బతికిన గొప్ప వైద్యుడు బంద్యోపాధ్యాయ్. ఆయన స్ఫూర్తిమంతమైన జీవితం ఎందరికో ఆదర్శం’ అని అన్నారు.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!