Site icon NTV Telugu

Parris: పారిస్ లో కలిసిన ఇద్దరు అత్యంత ధనవంతులు.. ఎవరా వాళ్లు..!

Parris

Parris

Parris: ప్రపంచలోనే అత్యంత ధనవంతులు వారిద్దరూ.. నంబర్ వన్ స్థానం వారిద్దరి మధ్య దోబూచులాడుతుంటుంది. వారిద్దరి సంపాదనలో స్వల్ప తేడా.. భారీ పోటీ ఉంటుంది. ఇంతకీ వారు ఎవరనుకుంటున్నారా..? ఫ్రెంచి వ్యాపారవేత్త, ఎల్‌వీఎంహెచ్‌ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, టెస్లా అధినేత ఎలన్ మస్క్.. ఇప్పుడు వీరిద్దరూ ఒక్కచోట కలిశారు. వారే కాకుండా తమ కుటుంబ సభ్యులు కూడా వారితో ఉన్నారు. ఎల‌న్ మ‌స్క్‌, బెర్నార్డ్ అర్నాల్ట్‌లు శుక్రవారం పారిస్‌లో త‌మ కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి లంచ్ చేశారు. ఇప్పుడీ వార్త ప్రపంచ వ్యాపార వర్గాల్లో ఓ సంచలనం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also: Uganda: స్కూల్‌పై టెర్రరిస్టుల దాడి.. 37 మంది విద్యార్థుల ఊచకోత..

ఫ్రాన్స్‌లోని పెయిర్స్‌లో జరుగుతున్న వివా టెక్నాలజీ సదస్సు 7వ ఎడిషన్‌కు ఆర్నాల్ట్, మస్క్ హాజరయ్యారు. ఈ సందర‍్భంగా వీరు శుక్రవారం లంచ్ కోసం కలుసుకున్నారు. తల్లి మేయే మస్క్‌తో కలిసి మస్క్‌ హాజరు కాగా.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని ఇద్దరు కుమారులు ఆంటోయిన్, అలెగ్జాండ్రే ఆర్నాల్ట్‌తో వచ్చారు. మరోవైపు ‘‘కలిసి పని చేద్దాం!.. ఫ్రాన్స్ ను ఎంచుకోండి’’ అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కోరారు. మస్క్‌తో కలిసి ఉన్న ఫోటోను ఆయన ట్వీట్‌ చేశారు.

Read Also: JD Chakravarthy: నాపై విషప్రయోగం జరిగింది.. జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్

ఫోర్బ్స్ అంచనా ప్రకారం.. ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 236.9 బిలియన్‌ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నంబర్ వన్ స్థానాన్ని ఇటీవల తిరిగి దక్కించుకున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం సంపద 233.4 బిలియన్‌ డాలర్లు. మొన్నటిదాకా తొలి స్థానంలో ఉన్న ఆర్నాల్ట్.. తన కంపెనీ షేర్లు పడిపోవడంతో రెండో స్థానంలోకి పడిపోయారు.

Exit mobile version