నేడు ఉద్యోగుల హెచ్ఆర్ఏపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. స్పష్టత రాకుంటే కార్యాచరణపై భేటీ కావాలని జేఏసీల ఐక్య వేదిక భావిస్తోంది.
నేడు కోవిడ్ పరిస్థితులు, వాక్సినేషన్పై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను కమిటీ ఖరారు చేయనుంది.
నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. నేటి నుంచి 10 రోజుల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచిఉంటాయని టీటీడీ వెల్లడించింది.