ఉదయం9 గంటలకు రాజ్ భవన్ లో 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం. పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.
ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు
ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు. సభ ముందుకు రానున్న కాగ్ నివేదిక
చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనున్న ఏడుగురు సభ్యుల బృందం.
అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 2:30 గంటలకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
ప్లాట్ ఫాం ధరలను తగ్గించిన రైల్వేశాఖ. ఇప్పటి నుండి ప్లాట్ ఫామ్ టికెట్ రూ.10గా వసూలు. కరోనా సమయంలో గతంలో స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు ప్లాట్ ఫాం ధరలను పెంచిన రైల్వే శాఖ.
నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
ఈ రోజు మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్టీ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్.