Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story What Is Reason Behind Few States Are Not Decreased Petrol Rates

పెట్రోల్ ధరలను కొన్ని రాష్ట్రాలు తగ్గించకపోవడానికి కారణాలేంటి?

Published Date :November 9, 2021 , 1:19 pm
By Ramesh Nalam
పెట్రోల్ ధరలను కొన్ని రాష్ట్రాలు తగ్గించకపోవడానికి కారణాలేంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలపై వివాదం నడుస్తోంది. దీనికి ఆజ్యం పోసింది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం అనే చెప్పాలి. దేశంలో పెట్రోల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. 2019 మేలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.89 ఉంటే ఇటీవల ఆ ధర రూ.116కి చేరింది. అంటే రెండేళ్లలోనే లీటర్ పెట్రోల్ ధర దాదాపుగా రూ.40 పెరిగింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు పెరిగాయి. ఈ ప్రభావం ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. పోటీ చేసిన సగానికి పైగా స్థానాల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో కేంద్రంలోని బీజేపీ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది.

Read Also: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సీనియర్స్‌ వర్సెస్‌ రెబల్స్‌

Also Read

  • Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
  • Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
  • Trump-King Charles: వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాడే దీపావళి కానుక పేరుతో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా సహా పలు రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్ రేట్లు రూ.10 మేర తగ్గాయి. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం నిధుల విషయంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వ్యాట్ తగ్గించడానికి ససేమిరా అంటున్నాయి.

వాస్తవానికి గత రెండేళ్లలో క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధరలు మన దేశంలో మాత్రం తగ్గలేదు. క్రూడాయిల్ ధరలు పడిపోయిన సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 వంతున ఎక్సైజ్ సుంకం విధించింది. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. కానీ మోదీ సర్కారు తెలివిగా పెట్రోలియం రంగంపై వచ్చే ఆదాయం డివిజబుల్ పూల్‌లోకి రాకుండా చర్యలు తీసుకుంది. సెస్‌లు, సర్‌ఛార్జీలు రూపంలో పన్నులు వసూలు చేస్తూ ఆ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచకుండా తనే వినియోగించుకునేలా ఎత్తులు వేసింది. దీంతో రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఆదాయానికి గండి పడింది. అందుకే ఇప్పుడు కేంద్రం వ్యాట్ తగ్గించాలని చెప్పినా.. పలు రాష్ట్రాలు తమకు ఆదాయం పడిపోతుందనే ఉద్దేశంతో వ్యాట్ తగ్గించడానికి ఇష్టపడటం లేదు.

2014-15లో పెట్రోలియం రంగంలో పన్నుల ద్వారా కేంద్రానికి రూ.1.72 లక్షల కోట్లు వస్తే ప్రస్తుతం ఆ ఆదాయం రూ.3.35 లక్షల కోట్లకు చేరింది. ఇందులో రాష్ట్రాల వాటా రూ.19,475 కోట్లు మాత్రమే. మిగతా ఆదాయం అంతా కేంద్రం చేతుల్లోనే ఉంటోంది. అసలే కరోనా దెబ్బతో రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు పెట్రోల్ ద్వారా వచ్చే ఆదాయంలో కోత విధించుకోమంటే దానిని భరించేందుకు తాము సిద్ధంగా లేమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. కరోనా ముందు నాటితో పోలిస్తే పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా కేంద్రానికి 79 శాతం ఆదాయం పెరిగినట్లు కొన్ని అధికారిక గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

Read Also: ఏడోవార్డు అంటే భయం.. పోటీచేస్తే అంతేనా?

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగకున్నా కేంద్ర ప్రభుత్వం అడ్డదిడ్డంగా ట్యాక్సులను పెంచి పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమైందని.. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను బూచిగా చూపెట్టడం సరికాదని తెలుగు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. పెట్రోల్ రేట్లను కొండంత పెంచి పిసరంత తగ్గించి తామేదో ఘనకార్యం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం డప్పు కొట్టుకోవడం విచిత్రంగా ఉందని ఆయా ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. జీఎస్టీ, ఇంకమ్ ట్యాక్సుల రూపంలో కేంద్రానికి ఆదాయం భారీగానే సమకూరుతోందని.. అందువల్ల పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం వసూలు చేస్తున్న సెస్‌లన్నీ తగ్గించుకుంటే లీటర్ పెట్రోల్ రూ.77కి వస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అటు ఉప ఎన్నికల ఫలితాల ప్రభావంతోనే కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెట్రోల్ ధరలు తగ్గించిందని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. దేశంలోని 14 రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేస్తే తాను కూడా వచ్చి పాల్గొంటానని పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central government
  • detail analysis
  • Petrol and Diesel price
  • trending news
  • VAT TAX

తాజావార్తలు

  • Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం

  • Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్‌ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి

  • KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

  • Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!

  • YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions