జనం మదిని గెలిచిన వందేమాతరం శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 9న వందేమాతరం శ్రీనివాస్ పుట్టినరోజు)
పాటను ఇంటిపేరుగా మార్చుకున్న గాయకుడు వందేమాతరం శ్రీనివాస్. స్వరకల్పనతోనూ సంబరాలు చేసుకున్న ఘనుడు వందేమాతరం. ఒకప్పుడు లో బడ్జెట్ మూవీస్ కు కంచుకోట లాంటి సంగీత దర్శకుడు శ్రీనివాస్. ఇక ఎరుపు రంగు పులుముకున్న చిత్రాలకు వందేమాతరం తప్ప వేరే దారి కనిపించేది కాదు. వరుసగా రెడ్ మార్క్ సినిమాలకు సంగీతం సమకూర్చినా వైవిధ్యంతో చిందులేయించేవారు శ్రీనివాస్. ఆరు నందులు ఆయన ప్రతిభకు పట్టం కట్టాయి. గాయకునిగా మూడు సార్లు, సంగీత దర్శకునిగా మూడు మార్లు నందిని అందుకొని ఆనందించారు శ్రీనివాస్. ఇప్పటికీ తన దరికి చేరిన పాటనైనా, సినిమానైనా గళంతోనూ, సంగీతంతోనూ పరుగులు తీయించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్.
టి.కృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్, విజయశాంతి జంటగా నటించిన ‘వందేమాతరం’ చిత్రంతో శ్రీనివాస్ వెలుగు చూశారు. ఆ సినిమాకు సంగీత దర్శకుడు చక్రవర్తి. “వందేమాతరం… వందేమాతరం…” అంటూ శ్రీనివాస్ పాడిన ఆ పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. సి.నారాయణ రెడ్డి రాసిన ఈ పాటలో “వందేమాతర గీతం వరస మారుతున్నది…” అనే పంక్తి ఉంది. ఆ పాట పాడిన తరువాత శ్రీనివాస్ రాతనే మారిపోయింది. తరువాత పలు చిత్రాలలో పాటగాడిగా సాగిన శ్రీనివాస్, ఆర్. నారాయణ మూర్తి నిర్మించిన కొన్ని చిత్రాలకు వరుసగా సంగీతం సమకూర్చారు. ఆ సినిమాలన్నీ రెడ్ మార్క్ వే అయినా, ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం పలికించారు. దాంతో వందేమాతరం శ్రీనివాస్ బిజీ అయిపోయారు. కేవలం ఎర్ర సినిమాలకే కాకుండా అన్ని రకాల చిత్రాలకూ స్వరకల్పన చేయగలనని నిరూపించుకున్నారు శ్రీనివాస్. ఆ పై ఆర్ .నారాయణ మూర్తికే అందనంత బిజీగా మారిపోయారు వందేమాతరం.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
వందేమాతరం శ్రీనివాస్ స్వరకల్పనలో రూపొందిన ఏకైక బిగ్ హిట్ ‘ఒసేయ్ రాములమ్మ’. ఈ చిత్రం ద్వారా ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డును అందుకున్న శ్రీనివాస్, ఆ తరువాత ‘స్వయంవరం’, ‘దేవుళ్ళు’ చిత్రాలకూ వినసొంపైన స్వరరచన చేసి మరో రెండు నందులను సొంతం చేసుకున్నారు. ఇక ‘ఒరేయ్ రిక్షా’లోని “మల్లెతీగెకు పందిరివోలె…” అంటూ గద్దర్ పలికించిన పాట పాడి ఉత్తమ గాయకునిగా తొలి నందిని అందుకున్నారు శ్రీనివాస్. ఆ పై ‘శ్రీరాములయ్య’, ‘దండకారణ్యం’ చిత్రాలతోనూ వందేమాతరం ఉత్తమ గాయకునిగా నిలిచారు. తన పాటలతో జనం మదిని గెలిచిన వందేమాతరం శ్రీనివాస్ గీతం యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నటునిగా ‘అమ్ములు’ చిత్రంలో కనిపించారు శ్రీనివాస్. ఆపై ‘బద్మాష్’ అనే చిత్రానికి మెగాఫోన్ పట్టి దర్శకత్వమూ వహించారు. తనలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకోవాలని తపించే వందేమాతరం శ్రీనివాస్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!