ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మొక్కలు నాటారు. జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్లోని జీహెచ్ఎంసీ పార్క్లో నిర్వహించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో తన బృందంతో కలిసి పాల్గొన్నారు. సింగర్లు అరుణ్ కౌండిన్య, అమల, మోహన, హైమత్ మహమ్మద్, గోమతి, రాహుల్ తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ‘మౌనంగానే ఎదగమని.. మొక్క నీకు చెబుతుంది’ అనే పాట పాడారు. తద్వారా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ని సంగీతమయం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ మనిషికి మొదటి గురువు…
(సెప్టెంబర్ 9న వందేమాతరం శ్రీనివాస్ పుట్టినరోజు)పాటను ఇంటిపేరుగా మార్చుకున్న గాయకుడు వందేమాతరం శ్రీనివాస్. స్వరకల్పనతోనూ సంబరాలు చేసుకున్న ఘనుడు వందేమాతరం. ఒకప్పుడు లో బడ్జెట్ మూవీస్ కు కంచుకోట లాంటి సంగీత దర్శకుడు శ్రీనివాస్. ఇక ఎరుపు రంగు పులుముకున్న చిత్రాలకు వందేమాతరం తప్ప వేరే దారి కనిపించేది కాదు. వరుసగా రెడ్ మార్క్ సినిమాలకు సంగీతం సమకూర్చినా వైవిధ్యంతో చిందులేయించేవారు శ్రీనివాస్. ఆరు నందులు ఆయన ప్రతిభకు పట్టం కట్టాయి. గాయకునిగా మూడు సార్లు, సంగీత…