ఆన్లైన్ టికెటింగ్ కు సినిమా నిర్మాతల మద్దతు: మంత్రి పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమ తప్పు లేకపోయినా తెలుగు చిత్రసీమకే నష్టం కల్గించే సంఘటనలు కొందరి ద్వారా ఇటీవల ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు చెబుతున్న అభిప్రాయంలో ఏకీభవించడం లేదని, సినిమా టిక్కెట్ల విషయంలో ఆన్లైన్ విధానంకు మద్దతు ఇస్తున్నామని, తమ ఆర్ధిక ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సినిమా నిర్మాతలు తనను అభ్యర్ధించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. బుధవారం మచిలీపట్నం లోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో మంత్రి పేర్నినానితో తెలుగు సినీ నిర్మాతలు దిల్ రాజు, డి వి వి దానయ్య, బన్ని వాసు, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి తదితర నిర్మాతల బృందం సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కూలంకుషంగా చర్చించారు.
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టిందన్న నేపథ్యంలో 50 శాతం ఉన్న సదుపాయాలను వంద శాతంకు పెంచమని ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో కోరారని, అలాగే నిర్వహణ వ్యయం, తమ పెట్టుబడులు తదితర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం టిక్కెట్ల ధర విషయంలో మరోమారు యోచించాలని నిర్మాతలు అడిగారన్నారు. ఏకాభిప్రాయంపై ఆన్లైన్ విధానం తామే అడిగామని, తమకే ఆ పద్ధతి ఎంతో అవసరమని నిర్మాతలు కోరినట్టు మంత్రి తెలిపారు. ఆన్లైన్ టిక్కెటింగ్ విధానం ఈనాటిది కాదని, 2005వ సంవత్సరం నాటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ విధానం కొనసాగిందని, ఈ విషయం ఎందరికో తెలియని సంగతని, పలు థియేటర్లలో ‘బుక్ మై షో , పే టీఎం , జస్ట్ టికెట్స్ పేరిట ఆన్లైన్ టికెట్ వ్యవస్థ కొనసాగుతోందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఒక నిర్దిష్టమైన విధానం ఉంటే చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి ఎంతో మంచిదని నిర్మాతలు కోరినట్లు చెప్పారు.
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ”తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ ఎంతో సున్నితమైనదని, లేనిపోని వివాదాస్పద అంశాలు లేవనెత్తి గందరగోళ పరిస్థితులు దయచేసి లేవనెత్తవద్దని, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకొంటున్నామ’ని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలు చిత్ర పరిశ్రమ బాగుండాలనే కోరుకొంటాయని, తమ పట్ల ఎంతో సానుకూలంగా ఉంటున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు, జరుగుతున్న వ్యతిరేక పరిణామాలు తమ అభిప్రాయం కాదని, ముఖ్యమంత్రికి తమ అభిప్రాయం దయచేసి తెలియచేయాలని మంత్రి పేర్ని నానికి వివరించినట్లు ‘దిల్’ రాజు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!