Tiger Poaching Gang: పులులను వేటాడుతున్న ముఠా.. పోలీసులకు చిక్కిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులిని చంపి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు వ్యక్తుల అంతర్ రాష్ట్ర ముఠాను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పట్టుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వికాస్ మాధవ్ గోట్ముక్లే, జ్యోతిరాం భికు పంద్రారం, ధొండిరాం లింబు చీక్రం, తిరుపతి మహదు చీక్రమ్, సందీప్ లింగు కోరంగే, ఇస్రు సోము మాదవి నిందితులుగా ఉన్నారని సెంట్రల్ చందా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకాంత్ పవార్ తెలిపారు.
Also Read:Hanuman idol: సాహిబ్గంజ్లో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
చంద్రాపూర్ జిల్లా జివాటి తాలూకాలోని పాతగూడలో పులి చర్మాన్ని విక్రయించేందుకు యత్నిస్తుండగా పక్కా సమాచారం మేరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డాదిన్నర క్రితం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ అడవుల్లో వేటగాళ్లు పులికి విషం పెట్టి చంపారని పవార్ తెలిపారు. అప్పటి నుంచి చర్మాన్ని కొనుగోలుదారులకు విక్రయించేందుకు ముఠా ప్రయత్నిస్తోంది. పులి చర్మం విక్రయిస్తున్న ముఠా కదలికలపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మూడు నెలల క్రితం సోదాలు చేపట్టి ఆరుగురిని పట్టుకున్నారు.
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
మంగళవారం నేరం జరిగిన ప్రదేశాన్ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తారని ఏసీఎఫ్ తెలిపారు. వేటగాళ్ల ఘటనపై మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.కేసు వివరాలను తెలుసుకోవడానికి మహారాష్ట్ర సహచరులతో మాట్లాడతానని ఇన్ఛార్జ్ జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు.
Also Read:Stray dog: వీధి కుక్క నోటిలో నవజాత శిశువు.. విచారణ కోసం ప్రత్యేక బృందాలు
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులు తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ నుండి పులుల వలసలను చూస్తున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో పులులను వేటాడిన సంఘటనలు నమోదు కానప్పటికీ, తాజా ఘటనతో ఇక్కడ పులుల భద్రతపై ఆందోళన నెలకొంది. మార్చి 25న బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామంలో పులిని వేటాడి గోర్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు పులి గోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 1న ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!