Tiger Poaching Gang: పులులను వేటాడుతున్న ముఠా.. పోలీసులకు చిక్కిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులిని చంపి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు వ్యక్తుల అంతర్ రాష్ట్ర ముఠాను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పట్టుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వికాస్ మాధవ్ గోట్ముక్లే, జ్యోతిరాం భికు పంద్రారం, ధొండిరాం లింబు చీక్రం, తిరుపతి మహదు చీక్రమ్, సందీప్ లింగు కోరంగే, ఇస్రు సోము మాదవి నిందితులుగా ఉన్నారని సెంట్రల్ చందా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకాంత్ పవార్ తెలిపారు.
Also Read:Hanuman idol: సాహిబ్గంజ్లో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
చంద్రాపూర్ జిల్లా జివాటి తాలూకాలోని పాతగూడలో పులి చర్మాన్ని విక్రయించేందుకు యత్నిస్తుండగా పక్కా సమాచారం మేరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డాదిన్నర క్రితం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ అడవుల్లో వేటగాళ్లు పులికి విషం పెట్టి చంపారని పవార్ తెలిపారు. అప్పటి నుంచి చర్మాన్ని కొనుగోలుదారులకు విక్రయించేందుకు ముఠా ప్రయత్నిస్తోంది. పులి చర్మం విక్రయిస్తున్న ముఠా కదలికలపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మూడు నెలల క్రితం సోదాలు చేపట్టి ఆరుగురిని పట్టుకున్నారు.
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
మంగళవారం నేరం జరిగిన ప్రదేశాన్ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తారని ఏసీఎఫ్ తెలిపారు. వేటగాళ్ల ఘటనపై మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.కేసు వివరాలను తెలుసుకోవడానికి మహారాష్ట్ర సహచరులతో మాట్లాడతానని ఇన్ఛార్జ్ జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు.
Also Read:Stray dog: వీధి కుక్క నోటిలో నవజాత శిశువు.. విచారణ కోసం ప్రత్యేక బృందాలు
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులు తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ నుండి పులుల వలసలను చూస్తున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో పులులను వేటాడిన సంఘటనలు నమోదు కానప్పటికీ, తాజా ఘటనతో ఇక్కడ పులుల భద్రతపై ఆందోళన నెలకొంది. మార్చి 25న బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామంలో పులిని వేటాడి గోర్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు పులి గోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 1న ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!