Tiger Poaching Gang: పులులను వేటాడుతున్న ముఠా.. పోలీసులకు చిక్కిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులిని చంపి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు వ్యక్తుల అంతర్ రాష్ట్ర ముఠాను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పట్టుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వికాస్ మాధవ్ గోట్ముక్లే, జ్యోతిరాం భికు పంద్రారం, ధొండిరాం లింబు చీక్రం, తిరుపతి మహదు చీక్రమ్, సందీప్ లింగు కోరంగే, ఇస్రు సోము మాదవి నిందితులుగా ఉన్నారని సెంట్రల్ చందా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకాంత్ పవార్ తెలిపారు.
Also Read:Hanuman idol: సాహిబ్గంజ్లో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
చంద్రాపూర్ జిల్లా జివాటి తాలూకాలోని పాతగూడలో పులి చర్మాన్ని విక్రయించేందుకు యత్నిస్తుండగా పక్కా సమాచారం మేరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డాదిన్నర క్రితం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ అడవుల్లో వేటగాళ్లు పులికి విషం పెట్టి చంపారని పవార్ తెలిపారు. అప్పటి నుంచి చర్మాన్ని కొనుగోలుదారులకు విక్రయించేందుకు ముఠా ప్రయత్నిస్తోంది. పులి చర్మం విక్రయిస్తున్న ముఠా కదలికలపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మూడు నెలల క్రితం సోదాలు చేపట్టి ఆరుగురిని పట్టుకున్నారు.
Also Read
మంగళవారం నేరం జరిగిన ప్రదేశాన్ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తారని ఏసీఎఫ్ తెలిపారు. వేటగాళ్ల ఘటనపై మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.కేసు వివరాలను తెలుసుకోవడానికి మహారాష్ట్ర సహచరులతో మాట్లాడతానని ఇన్ఛార్జ్ జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు.
Also Read:Stray dog: వీధి కుక్క నోటిలో నవజాత శిశువు.. విచారణ కోసం ప్రత్యేక బృందాలు
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులు తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ నుండి పులుల వలసలను చూస్తున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో పులులను వేటాడిన సంఘటనలు నమోదు కానప్పటికీ, తాజా ఘటనతో ఇక్కడ పులుల భద్రతపై ఆందోళన నెలకొంది. మార్చి 25న బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామంలో పులిని వేటాడి గోర్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు పులి గోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 1న ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!