Tiger Poaching Gang: పులులను వేటాడుతున్న ముఠా.. పోలీసులకు చిక్కిన నిందితులు
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులిని చంపి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు వ్యక్తుల అంతర్ రాష్ట్ర ముఠాను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పట్టుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వికాస్ మాధవ్ గోట్ముక్లే, జ్యోతిరాం భికు పంద్రారం, ధొండిరాం లింబు చీక్రం, తిరుపతి మహదు చీక్రమ్, సందీప్ లింగు కోరంగే, ఇస్రు సోము మాదవి నిందితులుగా ఉన్నారని సెంట్రల్ చందా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకాంత్ పవార్ తెలిపారు.
Also Read:Hanuman idol: సాహిబ్గంజ్లో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
చంద్రాపూర్ జిల్లా జివాటి తాలూకాలోని పాతగూడలో పులి చర్మాన్ని విక్రయించేందుకు యత్నిస్తుండగా పక్కా సమాచారం మేరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డాదిన్నర క్రితం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ అడవుల్లో వేటగాళ్లు పులికి విషం పెట్టి చంపారని పవార్ తెలిపారు. అప్పటి నుంచి చర్మాన్ని కొనుగోలుదారులకు విక్రయించేందుకు ముఠా ప్రయత్నిస్తోంది. పులి చర్మం విక్రయిస్తున్న ముఠా కదలికలపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మూడు నెలల క్రితం సోదాలు చేపట్టి ఆరుగురిని పట్టుకున్నారు.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
మంగళవారం నేరం జరిగిన ప్రదేశాన్ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తారని ఏసీఎఫ్ తెలిపారు. వేటగాళ్ల ఘటనపై మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.కేసు వివరాలను తెలుసుకోవడానికి మహారాష్ట్ర సహచరులతో మాట్లాడతానని ఇన్ఛార్జ్ జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు.
Also Read:Stray dog: వీధి కుక్క నోటిలో నవజాత శిశువు.. విచారణ కోసం ప్రత్యేక బృందాలు
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులు తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ నుండి పులుల వలసలను చూస్తున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో పులులను వేటాడిన సంఘటనలు నమోదు కానప్పటికీ, తాజా ఘటనతో ఇక్కడ పులుల భద్రతపై ఆందోళన నెలకొంది. మార్చి 25న బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామంలో పులిని వేటాడి గోర్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు పులి గోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 1న ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో