Tiger Poaching Gang: పులులను వేటాడుతున్న ముఠా.. పోలీసులకు చిక్కిన నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పులిని చంపి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన ఆరుగురు వ్యక్తుల అంతర్ రాష్ట్ర ముఠాను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో పట్టుకున్నారు. వారి నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వికాస్ మాధవ్ గోట్ముక్లే, జ్యోతిరాం భికు పంద్రారం, ధొండిరాం లింబు చీక్రం, తిరుపతి మహదు చీక్రమ్, సందీప్ లింగు కోరంగే, ఇస్రు సోము మాదవి నిందితులుగా ఉన్నారని సెంట్రల్ చందా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకాంత్ పవార్ తెలిపారు.
Also Read:Hanuman idol: సాహిబ్గంజ్లో హనుమాన్ విగ్రహం ధ్వంసం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
చంద్రాపూర్ జిల్లా జివాటి తాలూకాలోని పాతగూడలో పులి చర్మాన్ని విక్రయించేందుకు యత్నిస్తుండగా పక్కా సమాచారం మేరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డాదిన్నర క్రితం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ అడవుల్లో వేటగాళ్లు పులికి విషం పెట్టి చంపారని పవార్ తెలిపారు. అప్పటి నుంచి చర్మాన్ని కొనుగోలుదారులకు విక్రయించేందుకు ముఠా ప్రయత్నిస్తోంది. పులి చర్మం విక్రయిస్తున్న ముఠా కదలికలపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మూడు నెలల క్రితం సోదాలు చేపట్టి ఆరుగురిని పట్టుకున్నారు.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
మంగళవారం నేరం జరిగిన ప్రదేశాన్ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తారని ఏసీఎఫ్ తెలిపారు. వేటగాళ్ల ఘటనపై మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.కేసు వివరాలను తెలుసుకోవడానికి మహారాష్ట్ర సహచరులతో మాట్లాడతానని ఇన్ఛార్జ్ జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు.
Also Read:Stray dog: వీధి కుక్క నోటిలో నవజాత శిశువు.. విచారణ కోసం ప్రత్యేక బృందాలు
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అడవులు తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ నుండి పులుల వలసలను చూస్తున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో పులులను వేటాడిన సంఘటనలు నమోదు కానప్పటికీ, తాజా ఘటనతో ఇక్కడ పులుల భద్రతపై ఆందోళన నెలకొంది. మార్చి 25న బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామంలో పులిని వేటాడి గోర్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు పులి గోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 1న ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!