Extreme Summer : భారతదేశంలో అత్యంత హాటెస్ట్ సిటీ అదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం తీవ్రమైన వేసవిని ఎదుర్కొంటోంది. దేశంలోని చాలా ప్రాంతాలలో ఈరోజు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల జాబితాను విడుదల చేసింది, అగ్రస్థానంలో ఉన్న నగరం 43 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది.
Also Read:Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ షురూ.. ఫీజుల వివరాలు ఇవే..
వాతావరణ కార్యాలయం యొక్క జాబితాలో మొదటి రెండు స్థానాలను పశ్చిమ బెంగాల్లోని నగరాలు ఉన్నాయి. ముర్షిదాబాద్లో 43 డిగ్రీలు, బంకురాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలోనూ ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఢిల్లీ సహా దేశంలో ఐదు నగరాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గుజరాత్లోని అహ్మదాబాద్, రాజస్థాన్లోని చురు, చండీగఢ్, ఆంధ్రాలోని విజయవాడ, గురుగ్రామ్ గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ రికార్డు అయ్యాయి. బుధవారం మేఘావృతమైన వాతావరణం ఉంటుందని తేలికపాటి వర్షంతో ఢిల్లీలో వేడి కొంత ఉపశమనం కలిగించవచ్చని IMD అంచనా వేసింది.
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, రాబోయే రెండు రోజులలో దేశంలోని వాయువ్య ప్రాంతంలో వేడి గాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని IMD తెలిపింది. ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డు కార్యక్రమంలో 13 మంది వడదెబ్బతో మృతి చెందారు.
Also Read:Cm Jagan : ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్
మరోవైపు పంజాబ్, హర్యానా, బీహార్,కోస్టల్ ఆంధ్ర ప్రదేశ్ ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హర్యానా, పంజాబ్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. హిసార్లో 41.5 డిగ్రీల వద్ద స్థిరపడగా, పంజాబ్లోని భటిండాలో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బీహార్, పశ్చిమ బెంగాల్లో నాలుగు రోజుల పాటు తీవ్రమైన వేడి గాలులు ఉంటాయని IMD తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను శనివారం వరకు మూసివేయాలని కోరారు.
రాష్ట్రంలో వేడిగాలుల వంటి పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుండి 23 వరకు అన్ని ప్రభుత్వ, రాష్ట్ర సహాయ పాఠశాలలను మూసివేయనున్నట్లు త్రిపుర తెలిపింది. గతంలో ఒడిశా కూడా ఇదే ఆదేశాలను జారీ చేసింది.మే 31 వరకు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలుల పరిస్థితులతో పాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండవచ్చు అని శాస్త్రవేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!