Uttarapradesh : ఓరి దేవుడో.. ఇదేం కర్మరా బాబు..ఇలా తయారయ్యారెంట్రా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చోరీ జరిగింది అంటే ఎంత బంగారు పోయింది.. ఎంత డబ్బులు పోయాయి అని అడిగేవారు.. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని కేజిల టమోటాలు పోయాయి అని చర్చలు జరుగుతున్నాయి.. దొంగలు కూడా ఇప్పుడు రూటు మార్చుకున్నారు.. ధరలు పెరగడంతో ఎక్కువగా టమోటాలను ఎత్తుకెళ్తున్నారు.. దేశంలో పలు చోట్ల టమాటాలు చోరికి గురవుతున్నాయి.. దాంతో కూరగాయలు షాప్ యజమానులు సెక్యూరిటీని కూడా పెట్టుకుంటున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో చోరీ వెలుగులోకి వచ్చింది.. కొందరు దుండగులు అర్ధరాత్రి 2 కూరగాయల షాపుల్లకి ప్రవేశించి టమాటాలు, పచ్చి మిర్చి, అల్లం ఎత్తుకెళ్లారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు..
వివరాల్లోకి వెళితే.. ఈ చోరీ ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలో వెలుగు చూసింది.రెండు దుకాణాల్లో జరిగిన ఈ చోరీ ఉదంతం గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేపూర్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలోని రెండు దుకాణాల్లో జూలై 10 చోరీ జరిగింది. షాపు యజమానులు రామ్జీ, నయీమ్ఖాన్ ఇద్దరూ దుకాణాలు మూసివేసి రాత్రి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం తమ దుకాణాలు తెరిచి ఉండటం చూసి షాక్కు గురయ్యారు. షాపులోకి వెళ్లి తనిఖీ చేయగా టమోటాలు, అల్లం, మిరపకాయలు చోరీకి గురైనట్లు గ్రహించారు.. దాంతో పోలీసులను ఆశ్రయించారు..
Also Read
ఆ దుకాణాల్లో దాదాపు 26 కిలోల టమోటాలు, 25 కిలోల మిర్చి, 8 కిలోల అల్లం చోరీకి గురైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కమతా ప్రసాద్, మహ్మద్ ఇస్లాం అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాష్ట్ర పోలీసులపై విరుచుకుపడ్డారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేరును ‘స్పెషల్ టొమాటో ఫోర్స్’గా మార్చాలని సూచించారు.. మొత్తానికి ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!