Uttarapradesh : ఓరి దేవుడో.. ఇదేం కర్మరా బాబు..ఇలా తయారయ్యారెంట్రా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చోరీ జరిగింది అంటే ఎంత బంగారు పోయింది.. ఎంత డబ్బులు పోయాయి అని అడిగేవారు.. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని కేజిల టమోటాలు పోయాయి అని చర్చలు జరుగుతున్నాయి.. దొంగలు కూడా ఇప్పుడు రూటు మార్చుకున్నారు.. ధరలు పెరగడంతో ఎక్కువగా టమోటాలను ఎత్తుకెళ్తున్నారు.. దేశంలో పలు చోట్ల టమాటాలు చోరికి గురవుతున్నాయి.. దాంతో కూరగాయలు షాప్ యజమానులు సెక్యూరిటీని కూడా పెట్టుకుంటున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో చోరీ వెలుగులోకి వచ్చింది.. కొందరు దుండగులు అర్ధరాత్రి 2 కూరగాయల షాపుల్లకి ప్రవేశించి టమాటాలు, పచ్చి మిర్చి, అల్లం ఎత్తుకెళ్లారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు..
వివరాల్లోకి వెళితే.. ఈ చోరీ ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలో వెలుగు చూసింది.రెండు దుకాణాల్లో జరిగిన ఈ చోరీ ఉదంతం గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేపూర్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలోని రెండు దుకాణాల్లో జూలై 10 చోరీ జరిగింది. షాపు యజమానులు రామ్జీ, నయీమ్ఖాన్ ఇద్దరూ దుకాణాలు మూసివేసి రాత్రి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం తమ దుకాణాలు తెరిచి ఉండటం చూసి షాక్కు గురయ్యారు. షాపులోకి వెళ్లి తనిఖీ చేయగా టమోటాలు, అల్లం, మిరపకాయలు చోరీకి గురైనట్లు గ్రహించారు.. దాంతో పోలీసులను ఆశ్రయించారు..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
ఆ దుకాణాల్లో దాదాపు 26 కిలోల టమోటాలు, 25 కిలోల మిర్చి, 8 కిలోల అల్లం చోరీకి గురైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కమతా ప్రసాద్, మహ్మద్ ఇస్లాం అనే ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాష్ట్ర పోలీసులపై విరుచుకుపడ్డారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పేరును ‘స్పెషల్ టొమాటో ఫోర్స్’గా మార్చాలని సూచించారు.. మొత్తానికి ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
తాజావార్తలు
-
Oil Free Poori: ఒక్క చుక్క నూనె లేకుండా పొంగే పూరీలు.. ఎలాగో చూస్తే షాకవుతారు!
-
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
-
Petrol Price Hike: హైదరాబాద్లో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజుల్లో రెండోసారి షాక్!
-
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!