తెలంగాణ నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు వ్యవహారంపై మరోసారి కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ కానుంది. కృషి భవన్ లో రాత్రి 7.30 గంటలకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో భేటి కానున్న రాష్ట్ర మంత్రుల బృందం సమావేశం కానుంది.
ఈ భేటీకి హాజరుకానున్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నేడు స్పష్టత ఇచ్చే అవకాశం వుందని భావిస్తున్నారు. గత సమావేశంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఇతర మంత్రులు, ఎమ్.పిల బృందం ప్రస్తావించిన అంశాలపై నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం