Land For Jobs Scam Case: తేజస్వి యాదవ్పై ప్రశ్నల వర్షం.. 8 గంటలపాటు సీబీఐ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగాల కోసం భూ కుంభకోణం(Land-For-Jobs Scam Case) కేసులో సీబీఐ విచారణలో దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ను సీబీఐ ఈరోజు తన ప్రధాన కార్యాలయంలో ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించారు. కేసు విచారణ కోసం రావాలంటూ గతంలో సీబీఐ తేజస్వీయాదవ్ కు నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆయన ఉదయం 10:30 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. రాత్రి 8 గంటల వరకు అతన్ని విచారించారు. AB ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, AK ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లకు సంబంధించిన లింక్లతో సహా తేజస్వీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
Alsor Read:Gwalior Hospital: 400 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం.. అయినా స్ట్రెచర్లు లేవట!
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
తేజస్వీ యాదవ్ను ఈ నెలలో అరెస్టు చేయబోమని గత వారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఏప్రిల్ 5న ముగియనున్న బీహార్ అసెంబ్లీ సమావేశాల కారణంగా సీబీఐ దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావడానికి కొంత సమయం కావాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తరపు న్యాయవాది మణీందర్ సింగ్ హైకోర్టుకు తెలియజేశారు.
Alsor Read:Sansad Ratna Award 2023: సంసద్ రత్న అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్..
అసెంబ్లీని శనివారాల్లో సమావేశపరచలేదని, యాదవ్ తన సౌలభ్యం ప్రకారం మార్చిలో ఏ శనివారమైనా ఏజెన్సీ ముందు హాజరుకావచ్చని సిబిఐ తరపు న్యాయవాది డిపి సింగ్ వాదించారు. మార్చి 25న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణ అధికారి ఎదుట తేజస్వీ హాజరు అవుతారని మణీందర్ సింగ్ కోర్టుకు తెలిపారు. కాగా, ఫిబ్రవరి 28, మార్చి 4, మార్చి 11 తేదీల్లో తనకు వ్యతిరేకంగా జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని ఆర్జేడీ నేత తేజస్వీ కోరారు. ఇదే కేసులో యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్, తల్లి రబ్రీ దేవి, సోదరి మిషా భారతి తదితరులకు సీబీఐ ప్రత్యేక కోర్టు మార్చి 15న బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ స్కామ్లో నిందితుల ప్రమేయంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో సేకరించిన కొత్త వివషయాల ఆధారంగా ప్రశ్నలు సందిస్తోంది.
Alsor Read:Women’s World Boxing Championship: స్వర్ణం గెలిచిన నీతూ.. ఆరో మహిళగా రికార్డు
కాగా, 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి ప్రకటనలు, బహిరంగ నోటీసులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించి ఇష్టమైన అభ్యర్థులను నియమించారని సీబీఐ ఆరోపించింది. ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్ , హాజీపూర్లోని వివిధ జోనల్ రైల్వేలలో పాట్నా నుండి ప్రత్యామ్నాయాలను నియమించినట్లు ఏజెన్సీ పేర్కొంది. ప్రతిఫలంగా అభ్యర్థులు నేరుగా లేదా వారి కుటుంబ సభ్యుల ద్వారా, లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు అధిక రాయితీ ధరలకు భూమిని విక్రయించారని ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?