Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tejashwi Yadav Questioned By Cbi For 8 Hours In Land For Jobs Scam Case

Land For Jobs Scam Case: తేజస్వి యాదవ్‌పై ప్రశ్నల వర్షం.. 8 గంటలపాటు సీబీఐ విచారణ

Published Date :March 25, 2023 , 9:38 pm
By NTV WebDesk
Land For Jobs Scam Case: తేజస్వి యాదవ్‌పై ప్రశ్నల వర్షం.. 8 గంటలపాటు సీబీఐ విచారణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉద్యోగాల కోసం భూ కుంభకోణం(Land-For-Jobs Scam Case) కేసులో సీబీఐ విచారణలో దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను సీబీఐ ఈరోజు తన ప్రధాన కార్యాలయంలో ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించారు. కేసు విచారణ కోసం రావాలంటూ గతంలో సీబీఐ తేజస్వీయాదవ్ కు నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆయన ఉదయం 10:30 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. రాత్రి 8 గంటల వరకు అతన్ని విచారించారు. AB ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, AK ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు సంబంధించిన లింక్‌లతో సహా తేజస్వీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Alsor Read:Gwalior Hospital: 400 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం.. అయినా స్ట్రెచర్లు లేవట!

Also Read

  • Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
  • Trump: ఇరాన్‌తో యుద్ధం ముగిసింది.. వైట్‌హౌస్ కీలక ప్రకటన
  • Iran: ఇరాన్‌లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
  • Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?

తేజస్వీ యాదవ్‌ను ఈ నెలలో అరెస్టు చేయబోమని గత వారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఏప్రిల్ 5న ముగియనున్న బీహార్ అసెంబ్లీ సమావేశాల కారణంగా సీబీఐ దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావడానికి కొంత సమయం కావాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత తరపు న్యాయవాది మణీందర్ సింగ్ హైకోర్టుకు తెలియజేశారు.

Alsor Read:Sansad Ratna Award 2023: సంసద్ రత్న అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్‌..

అసెంబ్లీని శనివారాల్లో సమావేశపరచలేదని, యాదవ్ తన సౌలభ్యం ప్రకారం మార్చిలో ఏ శనివారమైనా ఏజెన్సీ ముందు హాజరుకావచ్చని సిబిఐ తరపు న్యాయవాది డిపి సింగ్ వాదించారు. మార్చి 25న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణ అధికారి ఎదుట తేజస్వీ హాజరు అవుతారని మణీందర్‌ సింగ్‌ కోర్టుకు తెలిపారు. కాగా, ఫిబ్రవరి 28, మార్చి 4, మార్చి 11 తేదీల్లో తనకు వ్యతిరేకంగా జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని ఆర్జేడీ నేత తేజస్వీ కోరారు. ఇదే కేసులో యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్, తల్లి రబ్రీ దేవి, సోదరి మిషా భారతి తదితరులకు సీబీఐ ప్రత్యేక కోర్టు మార్చి 15న బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ స్కామ్‌లో నిందితుల ప్రమేయంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో సేకరించిన కొత్త వివషయాల ఆధారంగా ప్రశ్నలు సందిస్తోంది.
Alsor Read:Women’s World Boxing Championship: స్వర్ణం గెలిచిన నీతూ.. ఆరో మహిళగా రికార్డు

కాగా, 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి ప్రకటనలు, బహిరంగ నోటీసులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించి ఇష్టమైన అభ్యర్థులను నియమించారని సీబీఐ ఆరోపించింది. ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్ , హాజీపూర్‌లోని వివిధ జోనల్ రైల్వేలలో పాట్నా నుండి ప్రత్యామ్నాయాలను నియమించినట్లు ఏజెన్సీ పేర్కొంది. ప్రతిఫలంగా అభ్యర్థులు నేరుగా లేదా వారి కుటుంబ సభ్యుల ద్వారా, లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు అధిక రాయితీ ధరలకు భూమిని విక్రయించారని ఆరోపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bihar Deputy Chief Minister
  • CBI
  • Delhi High Court
  • Tejashwi Yadav

తాజావార్తలు

  • School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు

  • Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?

  • Nitin Gadkari: “కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్”.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!

  • Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!

  • Ex MLA Shakeel Son: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసుల షాక్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions