AP Skill Development scam: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్.. మరో వ్యక్తి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Skill Development scam: ఏపీ స్కిల్ డెవలప్మెంట్కార్పొరేషన్ స్కామ్ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీఐడీ.. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ను అరెస్ట్ చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో సిమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ను నోయిడాలో అరెస్టు చేశారు.. ఇక, జీవీఎస్ భాస్కర్ను ట్రాన్సిట్ వారంట్పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది సీఐడీ.. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు భాస్కర్.. సిమెన్స్ సంస్థ రూపొందించిన ప్రోగ్రామ్ అసలు ధర 58 కోట్లు ఉంటే దానిని 3300 కోట్లుగా ప్రభుత్వానికి చూపెట్టినట్టు భాస్కర్ అండ్ కోపై ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ప్రాజెక్టులో మోసాలకు పాల్పడినట్టు సీఐడీ చెబుతోంది.
Read Also: Women’s World Boxing Championships: నీతూ గంగాస్ కు ‘గోల్డ్ మెడల్’
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు ధరగా నిర్ణయించి ప్రభుత్వాని వాటా కింద 371 కోట్లు కొట్టేసినట్టు సీబీఐ గుర్తించింది.. సిమెన్స్ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలోని అంశాలను సైతం పూర్తిగా మార్చేసిన భాస్కర్ అండ్ కో.. 3300 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కింద 371 కోట్లు ఇవ్వాల్సి ఉండగా… ప్రైవేటు సంస్థలు మిగిలన వ్యయం భరించాలి… ప్రైవేటు వాటా డబ్బుకు సంబంధించి ఎంవోయూలో ఎలాంటి ప్రస్తావన లేకుండా.. కేవలం ప్రభుత్వం వాటా 371 కోట్ల వర్క్ ఆర్డర్ రిలీజ్ చేసే విధంగా ఎంవోయూను మార్చేశారట భాస్కర్.. యూపీ క్యాడర్ ఐఏఎస్ అయిన తన భార్య అపర్ణను స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డిప్యూటీ సీఈవోగా నియమించుకునేందుకు అప్పటి సీఈవో సుబ్బారావుతో లాలూచీ పడ్డారని అభియోగాలున్నాయి.. ఇక, తన భార్యను డిప్యూటీ సీఈవోగా నియమించుకునే సమయంలో తమకు ఈప్రాజెక్టుతో సంబంధం ఉందని ఎక్కడా ప్రకటించలేదు భాస్కర్ దంపతులు.. ప్రభుత్వ నిధులు విడుదలయ్యేందుకు ప్రాజెక్టు విలువను థర్డ్ పార్టీ ద్వారా నిర్ధారించుకునేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ ద్వారా ప్రాజెక్టును స్టడీ చేయించారు.. సెంట్ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ అధికారులను ప్రభావితం చేయడం ద్వారా ప్రాజెక్టు విలువను పెంచుకున్న భాస్కర్.. నిధులను దారి మళ్లించేందుకు ఆప్టస్ హెల్త్ కేర్ అనే డొల్ల కంపెనీని ఏర్పాటు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
-
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!