అందరివాడు భరద్వాజ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 30న నటదర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బర్త్ డే)
తెలుగు సినిమా రంగంలో ఎవరికైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా అప్పట్లో మదరాసులోని యన్టీఆర్ ఇంటి తలుపు తట్టేవారు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు మారిన తరువాత ఆ స్థానాన్ని దాసరి నారాయణరావు ఆక్రమించారు. ఏ సమయంలో దాసరి ఇంటి తలుపు తట్టినా, తమకు న్యాయం జరుగుతుందని సినిమా రంగంలో ఎంతోమంది ఆశించేవారు. దాసరి ఉన్న రోజుల్లోనే అదే తీరున నేనున్నానంటూ చిత్రపరిశ్రమలోని కార్మికులను ఆదుకున్నవారిలో తమ్మారెడ్డి భరద్వాజ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. అలా అందరివాడు అనే పేరు సంపాదించిన భరద్వాజ, తెలుగు చిత్రసీమలో ఏ సమస్యవచ్చినా పరిష్కార మార్గం అన్వేషించేవారికి బాసటగా నిలిచేవారు. ఇప్పుడు కూడా అదే తీరున సాగుతున్నారాయన.
Also Read
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
తన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి చూపిన బాటలోనే పయనిస్తూ అందరికీ తలలో నాలుకలా మసలుకుంటున్నారు భరద్వాజ. నిర్మాతగా, దర్శకునిగా, నటునిగా భరద్వాజ జనాన్ని అలరించారు. తండ్రి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మరపురాని చిత్రాలను అందిస్తే, భరద్వాజ తన చరిత చిత్ర పతాకంపై జనాన్ని మురిపించే సినిమాలను రూపొందించారు. చిరంజీవికి నటునిగా పేరు సంపాదించి పెట్టిన కోతలరాయుడు, మొగుడు కావాలి చిత్రాలను నిర్మించింది భరద్వాజనే. తరువాతి రోజుల్లో దర్శకునిగా అలజడితో ఆకట్టుకున్నారు. ఇక నేనేరా పోలీస్ చిత్రంలో నటునిగానూ మెప్పించారు. ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ సాగిన భరద్వాజ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయినా, సినీజనానికి మాత్రం ఆయన ఎప్పుడూ దగ్గరివాడే!
నిర్మాతగా, దర్శకునిగా తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. మన్మథ సామ్రాజ్యం, నేటి దౌర్జన్యం, కడప రెడ్డెమ్మ, శివ-శక్తి, పచ్చని సంసారం, రౌడీ అన్నయ్య, బంగారు మొగుడు, కూతురు, అత్తా నీ కొడుకు జాగ్రత్త, సంచలనం, రామ్మా చిలకమ్మా, పోతే పోనీ, ప్రతిఘటన వంటి చిత్రాలు భరద్వాజ దర్శకత్వంలో రూపొంది జనం మెప్పు పొందాయి. కొన్ని చిత్రాలు పరాజయం పాలయినా, మరికొన్ని సినిమాల్లో భరద్వాజ దర్శకత్వ బాణీ ఆకట్టుకుంది. తాను ఓ వైపు దర్శకనిర్మాతగా రాణిస్తూనే, మరోవైపు ఇతర దర్శకులతో చిత్రాలను తెరకెక్కించారు. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో భరద్వాజ నిర్మించిన వన్ బై టూ, కృష్ణవంశీ దర్శకత్వంలో అంతఃపురం వంటి చిత్రాలను నిర్మించి జనాన్ని ఆకట్టుకున్నారు. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించిన ప్రతిఘటన తరువాత మళ్ళీ మెగాఫోన్ పట్టలేదు. దాదాపు ఏడేళ్ళయింది ఆయన సినిమాను రూపొందించి. అయితే సోషల్ మీడియాలో ఆ మధ్య యాక్టివ్ గానూ అలరించారు. ఏది ఏమైనా తెలుగు సినిమా రంగంలో భరద్వాజ అనగానే అందరివాడు అనే పేరు సంపాదించారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!