కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా.. కేంద్రం నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి బారినపడి చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని నిర్ణయించింది కేంద్రం.. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్లైన్స్ విడుదల చేసింది.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనుంది కేంద్రం.. ఈ మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ద్వారా ఇస్తామని పేర్కొంది. ఈ మొత్తాన్ని పొందాలంటే సదరు వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే మృతిచెందినవారి కుటుంబాలకే కాకుండా.. భవిష్యత్లులో కోవిడ్తో మృతిచెందేవారి కుటుంబాలకు కూడా ఈ ఎక్స్గ్రేషియా చెల్లించనున్నారు.
అయితే, ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ నుంచి సేకరించబడతాయి మరియు జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ లేదా జిల్లా పరిపాలన ద్వారా పంపిణీ చేస్తారు.. ప్రభుత్వం ఈరోజు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ విషయాన్ని పేర్కొంది. కాగా, కరోనాతో 2020 జనవరి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటికే మృతిచెందినవారి సంఖ్య 4.45 లక్షలకు పైగా నమోదైంది.. కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొన్న లేదా సంసిద్ధత కార్యకలాపాలలో పాల్గొన్న మరణించిన వారి కుటుంబాలకు కూడా పరిహారం ఇవ్వనున్నారు.. అయితే, ఆరోగ్య మంత్రిత్వ మార్గదర్శకాల ప్రకారం.. కరోనాతో మృతిచెందినట్టు సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలను సమర్పించిన 30 రోజుల్లోపు అన్ని క్లెయిమ్లు పరిష్కరించబడాలి.. ఆధార్తో అనుసంధానించబడిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ప్రక్రియల ద్వారా పంపిణీ చేయాలని పేర్కొంది కేంద్రం.
Also Read
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..