పాతికేళ్ళ ‘శ్రీకృష్ణార్జున విజయము’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పలు చిత్రాలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. నటరత్న యన్టీఆర్ శ్రీకృష్ణునిగా, అర్జునునిగా పలు చిత్రాలలో మెప్పించారు. అయితే ‘శ్రీమద్విరాటపర్వము’లో రామారావు అటు శ్రీకృష్ణునిగా, ఇటు అర్జునునిగానూ నటించారు. ఆ పాత్రలతో పాటు బృహన్నల, కీచక, దుర్యోధన పాత్రలనూ అందులో పోషించారు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే, తండ్రి లాగే పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలతోనూ జనాన్ని ఆకట్టుకున్నారు. రామారావు తరువాత అలా అన్ని రకాల చిత్రాలతో ప్రేక్షకులను మురిపించిన ఘనత బాలకృష్ణ సొంతం. ఇక తన తరం నటుల్లో ఈ క్రెడిట్ బాలయ్య ఒక్కరిదే అని అంగీకరించక తప్పదు. బాలకృష్ణ శ్రీకృష్ణునిగా, అర్జునునిగా నటించిన ‘శ్రీకృష్ణార్జున విజయము’ చిత్రం మే 15తో పాతికేళ్ళు పూర్తి చేసుకుంటోంది.
తండ్రితో కాకుంటే…తనయునితో…
యన్టీఆర్ ను సూపర్ స్టార్ ను చేసిన ఘనత దిగ్దర్శకుడు కేవీ రెడ్డికే దక్కుతుంది. కేవీ రెడ్డి వద్ద అసోసియేట్ గా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావుకు యన్టీఆర్ తోనూ ఎంతో అనుబంధం ఉంది. అయితే, రామారావును దర్శకత్వం వహించే అవకాశం మాత్రం లభించలేదు. దాంతో బాలకృష్ణతో తాను తెరకెక్కించిన మూడు చిత్రాలతోనే పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘికాలను రూపొందించగలిగారు. ‘ఆదిత్య 369’లో ఓ వైపు సాంఘిక కథతోనే, మరోవైపు టైమ్ మిషన్ లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి పోయినట్టుగా చూపించి, చరిత్రనూ మిళితం చేశారు. ఇక బాలయ్యతో సింగీతం తెరకెక్కించిన ‘భైరవద్వీపం’ జానపదం ఈ నాటికీ జానపద చిత్రాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ రెండు చిత్రాల తరువాత బాలకృష్ణ, సింగీతం కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘శ్రీకృష్ణార్జున విజయము’. ‘భైరవద్వీపం’ చిత్రాన్ని నిర్మించిన చందమామ విజయా కంబైన్స్ పతాకంపైనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. విజయా సంస్థాధినేతల్లో ఒకరైన బి.నాగిరెడ్డి తనయులు బి.వెంకట్రామ రెడ్డి, ఆయన సోదరులు ‘భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయము’ చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రంలో తొలుత కృష్ణుని పాత్రకు శోభన్ బాబును అనుకున్నారు. కానీ, అప్పటికే ఆయన వయసు మీద పడ్డవారు కావడం, మరికొన్ని కారణాల వల్ల వద్దనుకున్నారు. దాంతో శ్రీకృష్ణ, అర్జున రెండు పాత్రలనూ బాలకృష్ణ పోషించారు.
Also Read
- Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
- R. Narayana Murthy: 'కామ్రేడ్' పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
- Legacy: విశ్వక్ సేన్ 'లెగసీ' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ 'కామ్రేడ్ కళ్యాణ్'!
నాటక ఫక్కీలో…
‘శ్రీకృష్ణార్జున విజయము’ చిత్రంలో రోజా ద్రౌపదిగా నటించగా, ప్రియా రామన్ రుక్మిణిగా, అప్సరగా రంభ కనిపించారు. దుర్యోధన పాత్రలో శ్రీహరి, కర్ణునిగా దగ్గుబాటి రాజా, నారదునిగా నరేశ్, భీమునిగా విజయరంగరాజా, ధర్మరాజుగా చక్రపాణి, కె.ఆర్.విజయ కుంతిగా, ఏవీయస్ శకునిగా నటించారు. ‘భైరవద్వీపం’కు సంగీతం సమకూర్చిన మాధవపెద్ది సురేశ్ బాణీలలోనే ఇందులోని పాటలూ రూపొందాయి. ‘భైరవద్వీపం’ అందించిన అఖండ విజయం వలన వచ్చిన అమితోత్సాహం కాబోలు, ‘శ్రీకృష్ణార్జున విజయము’లోని చిత్రీకరణ ఆకట్టుకొనేలా తెరకెక్కలేదు. సన్నివేశాలన్నీ నాటకఫక్కీలో సాగాయి. సింగీతం వంటి దర్శకుడు సైతం ఈ చిత్రాన్ని ఎందుకనో చాలా తేలికగా తీసుకొని తెరకెక్కించినట్టు కనిపిస్తుంది. కనీసం వేషధారణల్లోనూ తగిన జాగ్రత్త వహించినట్టు కనిపించదు. ఆభరణాలు చూడగానే నాటకాల్లో వాడినట్టుగా కనిపించాయి. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ తో జిమ్మిక్స్ చేసే ప్రయత్నం చేసినా, అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో ఈ మూడో చిత్రం ఏ మాత్రం అలరించలేకపోయింది. అయితే బాలయ్య ద్విపాత్రాభినయం ఒక్కటే ఈ సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు.
తాజావార్తలు
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!