పదవి రాగానే ఆయన స్థాయి మారిందా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగర స్థాయి నేతగా ఉన్న ఆయన… నామినేటెడ్ పదవి రావటంతో ఒక్కసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేసింది. ఆయన రాజకీయ అరంగ్రేటం ఒకవర్గం నుంచి జరగ్గా.. ప్రస్తుతం ఆయన కలిసి పనిచేయాల్సిన నేత ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు. అదే ఆయనకు తలనొప్పిగా మారిందట. ఆ నేత కలిసి పనిచేస్తున్పప్పటికీ ఆయన సామాజికవర్గంలోని కొందరు మాత్రం లోలోపల గొణుక్కుంటున్నారట. మరికొందరైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారట. దీంతో కొత్త పదవి కత్తి మీద సాములా మారిందట. ఆయనెవరో ఇప్పుడు చూద్దాం.
వంగవీటి రాధా అనుచరుడిగా అడపా శేషు రాజకీయ ప్రస్థానం!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
బెజవాడ రాజకీయాలు అంటే ఎక్కడైనా ఒకే కానీ ఆ ఒక్క క్యాస్ట్ ఫీలింగ్ దగ్గర మాత్రం అస్సలు రాజీపడేది లేదంటారు అక్కడి నేతలు. అదే ఇప్పుడు నేతలకు సమస్యగా మారింది. విజయవాడ నగర వైసీపీ నేత అడపా శేషుకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ పదవిని కట్టబెట్టింది ప్రభుత్వం. పదవి వచ్చిన తర్వాత ఆయనకు కొత్త కష్టాలు మొదలయ్యాయట. అడపా శేషు రాజకీయ ప్రస్థానం మొదలైంది వంగవీటి కుటుంబం నుంచే. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలోనే ఆయనతోపాటు ఉన్నవారిలో శేషు కూడా ప్రధాన అనుచరుడు. 2005లో జరిగిన ఎన్నికల్లో శేషుకు కార్పొరేటర్ టికెట్ను తన నియోజకవర్గంలో ఇప్పించారు రాధా. ఆ ఎన్నికల్లో తొలిసారి ఆయన కార్పొరేటర్గా గెలిచారు కూడా.
గౌతంరెడ్డితో వచ్చిన వివాదంలో రాధ వెంట ఉన్నారు అడపా శేషు!
ఆ తర్వాత రాధా కాంగ్రెస్ను వీడి ప్రజారాజ్యంలో చేరారు. అయితే శేషు కాంగ్రెస్ను వీడకుండా అదేపార్టీలో కొనసాగినప్పటికీ రాధాతో సంబంధాలు చెడిపోలేదని చెబుతారు. వంగవీటి రాధా వైసీపీలో చేరిన తర్వాత మళ్లీ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. రాధా వైసీపీలో ఉన్న సమయంలోనే అదేపార్టీకి చెందిన గౌతంరెడ్డి వంగవీటి రంగాపై చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. గౌతంరెడ్డి ఇంటికి వెళ్తానని రాధా ప్రకటించినప్పుడు వెంట నడిచారు. తర్వాత కాలంలో రాధా వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీ గూటిలో చేరారు.
వైసీపీలో దేవినేని అవినాష్తో కలిసి అడపా శేషు ప్రయాణం!
మొన్నటి ఎన్నికల్లో విజయవాడ తూర్పులో వైసీపీ నుంచి బొప్పన భవకుమార్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడా నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్గా దేవినేని అవినాష్ ఉన్నారు. మొదటి నుంచి వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య వైరం ఉంది. ఇక్కడ వర్గీయులు అక్కడకు, అక్కడ వారు ఇక్కడ పనిచేసింది చాలా అరుదనే చెప్పాలి. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్గా దేవినేని అవినాష్ వచ్చినప్పటి నుంచి పట్టుకోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఆ సమయంలో తన రాజకీయ భవిష్యత్ కోసం అడపా శేషు కూడా అవినాష్ వర్గంతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చినా… కాపు సామాజికవర్గంతో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా పని చేసుకుపోయారు. ఈ కారణంగానే ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ టికెట్ పొంది రెండోసారి కార్సొరేటర్గా గెలిచారు. డిప్యూటీ మేయర్ పదవి ఆశించినా దక్కలేదు. ఇప్పుడు ఏకంగా కాపు కార్పొరేషన్కు ఛైర్మన్ను చేశారు.
కాపు కార్పొరేషన్ ఛైర్మన్ హోదాలో అవినాష్తో కలిసి పనిచేయడంపై ప్రశ్నలు!
పదవి వచ్చిన సంతోషం కంటే సూటిపోటి మాటలతో తలబొప్పి కడుతోందా?
ప్రస్తుతం దేవినేని అవినాష్తో పూర్తి స్థాయిలో శేషు పనిచేయాలి. ఇది కొందరు కాపు సామాజిక వర్గం నేతలకు మింగుడుపడటం లేదట. పదవి వచ్చిన తర్వాత అవినాష్ను కలిసి అడపా శేషు సన్మానించటం ఆ వర్గాలకు మంట పుట్టించిందట. దీనిపై శేషును సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కార్పొరేటర్గా అవినాష్తో కలిసి మెలిసి తిరిగినా పెద్దగా పట్టించుకోని అడపా సామాజికవర్గం.. ఆయన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యాక అదెలా కుదురుతుందని అంటున్నారట. ఛైర్మన్గా రేంజ్ పెరిగింది. ఇకపై అవినాష్తో గ్యాప్ మెయింటైన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారట. అంతేనా ఎక్కడ నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోవాలని అంటూ రుస రుసలాడుతున్నారట అడపా సామాజికవర్గం నేతలు. ఇది చూస్తున్న అడపాకు పదవి వచ్చిందన్న సంతోషం కంటే సొంత నేతల సెటైర్లు, సూటిపోటి మాటలు తలనొప్పిగా మారాయట.
తన పని కత్తిమీద సాములా మరిందని భావిస్తున్న అడపా.. అటు అవినాష్ వర్గంలో కలిసి పనిచేస్తూనే రంగా అభిమానులతో ఇబ్బంది లేకుండా పనిచేయడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మరి ఈ సమస్యను ఆయన ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.
- Tags
- adapa seshu
- ap
- YCP Leader
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..