తిరుమలలో సర్వదర్శనానికి కరోనా గ్రహణం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారిని ఉచితంగా దర్శించుకునే భాగ్యం సామాన్య భక్తులకు తిరిగి ఎప్పుడు లభిస్తుంది? సామాన్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తామనే టీటీడీ.. ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదు? కరోనా తీవ్రతవల్ల నిలిచిపోయిన సర్వదర్శనం తిరిగి ప్రారంభించేది ఎప్పుడు? 300ల నుంచి వీఐపీల వరకు టికెట్లు పెట్టి దర్శనం చేయిస్తున్న టీటీడీకి ఉచిత దర్శనం ఎందుకు పట్టడం లేదు? ఆదాయంపై ఉన్న ధ్యాస సామాన్య భక్తులపై లేదా?
సామాన్య భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటే ఆహార పానీయాలు ఉచితం
Also Read
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
ఇల వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం క్యూలైన్ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు స్వామివారిని దర్శించుకునే వెసులుబాటు సర్వదర్శనం భక్తులకు ఉంటుంది. సామాన్య భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశిస్తే.. వారికి దర్శనభాగ్యం కలిగించే వరకు అన్నీ టీటీడీయే సమకూరుస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో గంటల తరబడి భక్తులు వేచిఉంటే.. ఆ సమయంలో వారికి ఆహార పానీయాలు అన్ని కూడా ఉచితంగా అందిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు గతంగతః అన్నట్టుగా మారిపోయింది.
కరోనా మొదటి వేవ్లో 22 వేల మందికి సర్వ దర్శనం!
కరోనా వైరస్ మొదటివేవ్లో గతఏడాది మార్చి 21న శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసింది టీటీడీ. 80 రోజుల తర్వాత దర్శనాలు పునరుద్ధరించినా.. పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించింది. రోజుకి 6 వేల మంది వచ్చేలా మార్పులు చేసినా.. సర్వదర్శన భక్తులుకు ప్రాధ్యనం ఇచ్చింది. మొదట్లో 3వేల మంది ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా.. మరో 3వేల మంది సర్వదర్శనం క్యూలైను ద్వారా వెళ్లేవారు. ఆ తర్వాత భక్తుల సంఖ్యను పెంచుతూ వెళ్లింది. ఆ విధంగా ఈ ఏడాది ఏప్రిల్ 14 నాటికి స్వామివారిని దర్శించుకునే సర్వదర్శనం భక్తుల సంఖ్య 22 వేలకు చేరింది.
ఏప్రిల్ 14 నుంచి సర్వదర్శనం టికెట్ల జారీ నిలిపివేత
కరోనా సెకండ్ వేవ్లో దర్శనాలు ఆపకపోయినా.. భక్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది టీటీడీ. ఈ ప్రభావం సర్వదర్శనం భక్తులపై పడింది. ఏప్రిల్ 14 నుంచి సర్వదర్శనం భక్తులకు జారీచేసే దర్శన టోకెన్లను పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 5 వేలకు కుదించింది. అయినప్పటికీ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 18 వేల వరకు ఉంటోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, వర్చువల్ సేవా , శ్రీవాణి ట్రస్ట్, పర్యాటక శాఖ జారీ చేసే టికెట్లు కలిగిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీరంతా 300 నుంచి 10వేల రూపాయలు వరకు పెట్టి టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు. దీంతో టికెట్ల ద్వారా కోటి.. హుండీ ద్వారా మరో కోటికిపైగా ఆదాయం వస్తోంది.
సర్వదర్శనంలో భక్తులు వచ్చి 75 రోజులు దాటింది
కొండకు వచ్చే భక్తుల్లో 60-65 శాతం మంది ఉచిత దర్శనం
ప్రస్తుతం కాసులు చెల్లించిన వారికే దర్శనం. సర్వదర్శనం భక్తులు వచ్చి 75 రోజులవుతోంది. ఈ కోటాలో టికెట్లు జారీ చేస్తే కరోనా తీవ్రత పెరుగుతుందనే అనుమానంతో వాయిదా వేస్తూ వస్తోంది టీటీడీ. సాధారణంగా తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల్లో 60-65 శాతం ఉచిత దర్శనం చేసుకునే వారే ఉంటారు. అలాంటిది కరోనా పేరుతో టికెట్లు కొనేవారికి ఇస్తున్న ప్రాధాన్యంలో కనీసం సగం కూడా సామాన్య భక్తులకు టీటీడీ ఇవ్వడం లేదు. కనీసం అందుకు వీలున్న ప్రత్యామ్నాయాలను కూడా పట్టించుకోవడం లేదు. మళ్లీ కరోనా థర్డ్వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఆ సాకుతో ఇప్పుడప్పుడే సామాన్యులకు శ్రీవారి దర్శన భాగ్యం దక్కే సూచనలు కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
-
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!