సీఎం చెప్పిన ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు…?
ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఇద్దరు బీజేపీ నేతల పేర్లను సీఎం జగన్ ప్రస్తావించారా? ఆ ఇద్దరు బీజేపీ నేతలు ఎవరు? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? సీఎం నన్ను అన్నారంటే.. కాదు కాదు నన్నే అన్నారు అని కమలనాథులు ఎందుకు పోటీపడి చెప్పుకొంటున్నారు? ఏంటా రగడ? లెట్స్ వాచ్!
ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ప్రస్తావించిన సీఎం?
Also Read
ఏపీ బీజేపీ నేతలను కట్టడి చేయాలని సీఎం జగన్ మంత్రులను ఇటీవల ఆదేశించారు. అఫీషియల్ అజెండా తర్వాత కేబినెట్ మీటింగ్లో జరిగిన రాజకీయ చర్చలో మంత్రులను ఈ విషయంలో సీఎం ప్రశ్నించారట. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన నిలదీశారట. ఈ సందర్భంగానే ఇద్దరు బీజేపీ నేతల పేర్లను ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టు సమాచారం. ప్రభుత్వంపై ఆ ఇద్దరూ విమర్శలు చేస్తుంటే మంత్రులు ఎందుకు ఘాటుగా తిప్పికోట్టడం లేదని అడిగారట. పైగా బీజేపీ విషయంలో మరీ ఆచితూచి వెళ్లాల్సిన అవసరం లేదని మంత్రులకు సీఎం పరోక్షంగా స్పష్టం చేశారట.
ఒకటి వీర్రాజు పేరు.. రెండోది ఎవరు?
కేబినెట్ సమావేశంలో సీఎం ప్రస్తావించిన ఆ ఇద్దరు నేతలు ఎవరన్నది బీజేపీలో చర్చగా మారింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. పార్టీ కోఇంచార్జ్ సునీల్ దేవధర్ పేర్లను సీఎం ప్రస్తావించారని కొందరు చెబుతున్నారట. వీర్రాజుతోపాటు బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి పేర్లను ఉటంకించారన్నది మరికొందరి వాదన. ఒక పేరు సోము వీర్రాజు అని ఖరారైనా.. రెండోది ఎవరన్నదే కమలనాథులకు తేలడం లేదట. పైగా కేబినెట్ సమావేశంలో తమ పేర్లను సీఎం ప్రస్తావించడాన్ని అచీవ్మెంట్గా భావిస్తున్నారట బీజేపీ నేతలు. దీంతో ముఖ్యమంత్రి మమ్మల్ని అన్నారంటే మమ్మల్ని అన్నారని చెప్పుకోవడంలో పోటీ పడుతున్నారు కమలనాథులు.
సీఎం స్పందిస్తే బీజేపీ నేతల లక్ష్యం నెరవేరినట్టేనా?
అధికారపక్షం గుర్తిస్తే.. స్వపక్షంలో గుర్తింపు లభించినట్టేనా?
కార్యక్రమం ఏదైనా ఈ మధ్య వైసీపీని టార్గెట్ చెయ్యడంలో బీజేపీ జోరు పెంచింది. అధిష్ఠానం నుంచి వచ్చిన ఆదేశాలు కావచ్చు లేక.. హైకమాండ్ దృష్టిలో పడే ప్రయత్నం కావచ్చు.. దూకుడు పెంచారు నాయకులు. ఇదే సందర్భంలో తాము మాట్లాడింది.. తెరపైకి తెచ్చిన అంశాలు కూడా అందరి దృష్టిలో పడాలి అనుకుంటున్నారట. సీఎం లాంటి వారు తమ ఆరోపణలు, కార్యక్రమాలకు స్పందిస్తే తమ లక్ష్యం నెరవేరినట్టేనని భావిస్తున్నారట. కేబినెట్ మీటింగ్లో సీఎం చేసిన కామెంట్స్పై బీజేపీ నేతలు ట్విటర్లో, పార్టీ వేదికలపైనా ఇప్పటికే స్పందించారు. అయితే రెండో నేత ఎవరో అంతుచిక్కడం లేదట. అధికారపక్షంలో ఇలా తమను గుర్తిస్తేనే.. స్వపక్షంలో గుర్తింపు లభిస్తుందని భావించారో ఏమో.. కమలనాథుల్లో మాత్రం ఆరాటం కనిపిస్తోందని టాక్.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!