ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రివర్స్ జంపింగ్లు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు వరస ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయారు. రాజకీయ భవిష్యత్ కోసం.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పంచన చేరారు. అక్కడా కుదురుకోలేని పరిస్థితి. ఇంతలో పీసీసీ చీఫ్గా రేవంత్ రావడంతో ఘర్వాపసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే ఆ జిల్లా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ నేతలు రేవంత్తో టచ్లో ఉన్నారా?
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి రావడంతో మంచిరోజులు వచ్చాయని భావిస్తున్నారట. ఇదే సమయంలో గతంలో రేవంత్రెడ్డితో కలిసి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి.. ఇమడలేక బీజేపీలోకి వెళ్లినవారు పునరాలోచనలో పడ్డారట. తిరిగి వచ్చేస్తామని రేవంత్తో టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
బీజేపీకి బోడ జనార్దన్ గుడ్బై చెప్పేస్తారా?
ఉమ్మడి జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు ఇప్పటికే రేవంత్ దగ్గరకు వెళ్లి పూలబొకేలు ఇచ్చి వచ్చారు. చెన్నూరుకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్ సైతం పీసీసీ చీఫ్ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో జనార్దన్కు పడటం లేదనే టాక్ ఉంది. ఆ మధ్య వివేక్కు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశానికి కూడా వెళ్లారాయన. దీంతో జనార్దన్ బీజేపీకి గుడ్బై చెప్పే సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.
మాజీ మంత్రి వినోద్ కూడా రేవంత్తో మాట్లాడారా?
రేవంత్ను కలిసిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తనయుడు రితేష్
కాంగ్రెస్ నుంచి బీఎస్పీలోకి వెళ్లిన మాజీ మంత్రి వినోద్ కూడా పీసీసీ చీఫ్ను కలిసినట్టు చెబుతున్నారు. బీజేపీ నేత రావి శ్రీనివాస్ సైతం కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. నిన్న మొన్నటి వరకు పార్టీ మారతారని ప్రచారం జరిగిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్రావు సైతం కాంగ్రెస్లోనే ఉంటానని ప్రకటన చేశారు. ఇక ఇటీవలే బీజేపీ కండువా కప్పుకొన్న మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ గురించి కూడా ప్రచారం మొదలైంది. ఎప్పుడు పార్టీ మారినా కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లడం మాజీ ఎంపీకి అలవాటు. అయితే రమేష్ రాథోడ్ తనయుడు రితేష్ బీజేపీతో టచ్మీ నాట్గా ఉంటున్నారు. పైగా రేవంత్ను కలిసి అభినందనలు తెలియజేయడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. తండ్రి బీజేపీలో..తనయుడు కాంగ్రెస్లో కొనసాగుతారా? లేక ఇద్దరూ ఒకే కండువా కప్పుకొంటారా అన్న చర్చ జోరందుకుంది. స్థానిక పరిణామాలకు అనుగుణంగా కండువాలు మారతాయనే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. రమేష్ రాథోడ్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనకు ఖానాపూర్ అసెంబ్లీతోపాటు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇప్పించింది రేవంతేనట. ఆ అంశాన్ని ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
పార్టీ మారి తప్పుచేశామా అని మథన పడుతున్నారా?
వీరే కాకుండా ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న నాయకుల్లో చాలామంది రేవంత్ అభిమానులు ఉన్నారట. వారంతా పార్టీ మారి తప్పు చేశామా అని మథన పడుతున్నారట. పీసీసీ చీఫ్ నుంచి సంకేతాలు రాగానే చాలా మంది వెనక్కి వచ్చేస్తారని అనుకుంటున్నారు. అయితే మళ్లీ గోడ దూకేది ఎంత మంది అన్నదే ఆసక్తిగా మారింది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!