ఉరిశిక్ష నుంచి ఆ వ్యక్తిని కాపాడిన కరోనా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా లక్షలాది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి అందరికీ చేటు చేస్తే ఆ వ్యక్తికి మాత్రం మంచి చేసింది. మరికొద్ది గంటల్లో ఉరిశిక్ష అమలు చేయాల్సిన ఖైదీకి కరోనా సోకడంతో శిక్షను అమలు చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘటన సింగపూర్లో జరిగింది. మలేషియాకు చెందిన భారత సంతతికి చెందిన ధర్మలింగం అనే వ్యక్తి మారక ద్రవ్యాల కేసులో సింగపూర్ ధర్మాసనం ఉరిశిక్షను విధించింది. సింగపూర్లో 42 గ్రాముల హెరాయిన్ ను కలిగిఉన్నారని ధర్మలింగం నాగేంద్రన్పై అభియోగాలు మోపబడ్డాయి. 2009 లో అతనిపై కేసు నమోదు చేశారు. 2010లో ధర్మాసనం ధర్మలింగానికి ఉరిశిక్ష విధించింది. కాగా, ఉరిశిక్ష నుంచి బయటపడేందుకు అన్ని కోర్టుల చుట్టూ తిరిగాడు.
Read: మారని పరిస్థితులు… దిగజారుతున్న జీవనం…
Also Read
క్షమాభిక్ష కోసం అధ్యక్షుడికి ధరఖాస్తు చేసుకున్నాడు. అయినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో 11 ఏళ్ల క్రితం మరణశిక్ష పడగా దానిని నవంబర్ 10 వ తేదీన ఛాంగీ జైల్లో అమలు చేయాల్సి ఉన్నది. అయితే, నాగేంద్రన్ మానసిక ఆరోగ్యం బాగాలేదని, ఉరిశిక్షను వాయిదా వేయాలని కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఆ పిటీషన్ను కొట్టివేస్తూ కావాలంటే అప్పీల్కు వెళ్లేందుకు అనుమతించింది. దీంతో హైకోర్టుకు ఆశ్రయించాడు ధర్మలింగం. మంగళవారం రోజున అత్యవసరంగా విచారణ చేపట్టిన సమయంలో జైలు అధికారులు ధర్మలింగానికి కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగిందని కోర్టుకు తెలిపారు.
దీంతో కోర్టు ధర్మలింగం ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. మానవతా దృక్పధంతో ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తీర్పును వెలువరించింది. ధర్మలింగం ఉరిశిక్షను రద్ధు చేయాలని కోరుతూ వేలాది మంది కోర్టు భయట ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. అటు మలేషియా ప్రభుత్వం కూడా ఉరిశిక్షను రద్దుచేయాలని కోరుతూ సంతకాలు చేసింది. దీంతో నాగేంద్రన్ ధర్మలింగం ఉరిశిక్ష అంశం అంతర్జాతీయ అంశంగా మారింది.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!