కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది.. ఆయన దివంగత భార్య సునంద పుష్కర్ మృతి కేసులో శశి థరూర్ పై ఉన్న అభియోగాలను తోసిపుచ్చిన ఢిల్లీలోని సెషన్స్ కోర్టు.. ఇవాళ ఆయనకు నిర్ధోషిగా ప్రకటించింది… కాగా, సునంద పుష్కర్ 2014 జనవరిలో ఓ హోటల్ గదిలో శవమై కనిపించింది. ఆమె డ్రగ్స్ వాడినట్టు వైద్యుల నివేదిక సూచించింది. ప్రాథమిక విచారణలో ఇది హత్యా? కాదా ? అనే కోణంలో విచారణ జరిపిన పోలీసులు చివరకు ఆత్మహత్యాయత్నగా చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, సునంద్ పుష్కర్ ను ఆత్మహత్య చేసుకొనేలా శశిథరూర్ ప్రేరేపించారని ఆయనపై ఆరోపణలువచ్చాయి.. ఐపీసీ సెక్షన్ 498 ఎ (వైవాహిక క్రూరత్వం) మరియు 306 (ఆత్మహత్యకు ప్రేరణ) సెక్షన్ల కింద ఈ కేరళ కాంగ్రెస్ నేత శశి థరూర్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. చార్జిషీట్లో కూడా చేర్చారు.. మొత్తంగా ఇవాళ ఆయనకు ఈ కేసులో ఊరట లభించింది.