మినీ కాశ్మీర్లా సికింద్రాబాద్ కంటోన్మెంట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పరిపాలన సాగిస్తున్న కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్లో కూడా ఉన్న విషయం మనకు తెలిసింది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలను పలకరిస్తే కంటోన్మెంట్ ప్రాంతం కాశ్మీర్లా మారిందంటూ పలువురు సమాధానం చెప్పడం గమనార్హం. వారి మాటలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తిరుమలగిరి, మారేడ్పల్లి, అమ్ముగూడ, హకీంపేట, జవహర్ నగర్, కార్ఖాన, బోయిన్పల్లి, కౌకూర్, బొల్లారం ప్రాంతాలు ఉన్నాయి.

అయితే ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఆర్మీ అధికారులు విధించే షరతులతో విసిగి వేసారిపోయారు. కంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. ఏ రోడ్డుపై వెళ్లినా ఏ ఆంక్షలు ఉంటాయో, ఏ రోడ్డులో నో ఎంట్రీ బోర్డు పెడుతారోనని, ఏ రోడ్డు ఎప్పుడు మూసివేస్తారో తెలియక ఆయోమయంలో అక్కడి ప్రజలు ఉన్నారు. ఇక మౌలిక వసతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీధి దీపాలు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలతో నిత్యం మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో మంత్రి కేటీఆర్ సైతం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలకు ఇక్కడి పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా విన్నవించారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు

అయితే కంటోన్మెంట్ జోన్లో రోడ్లు మూసివేయలేదని కేంద్ర మంత్రులు చెప్పడంతో.. ఇటీవల కేటీఆర్ కంటోన్మెంట్ జోన్లలో మూసిన రోడ్లకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. గతంలో కూడా కంటోన్మెంట్ జోన్లో రోడ్లు వెడల్పు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయినప్పటికీ కేంద్రం నుంచి సరైన జవాబు రాలేదు. అయితే ఇప్పుడు అక్కడి ప్రజలు కంటోన్మెంట్ ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో కలపాలని కోరుతున్నారు. మౌలిక వసతులతో పాటు రాష్ట్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్లో కూడా మాకు అన్యాయం జరుగుతోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తున్న కొందరు కంటోన్మెంట్ జోన్ మినీ కాశ్మీర్లా మారిందా..? అని చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..