ఐపీఎల్ లో ప్రస్తుతం 8 జట్లు మాత్రమే పోటీ పడుతుండగా.. ఆ టైటిల్ కు మరింత పోటీని పెంచేందుకు కొత్తగా రెండు కొత్త జట్లను తీసుకురానున్నట్లు బీసీసీఐ ఎప్పుడో ప్రకటించగా ఈరోజు ఆ రానున్న రెండు కొత్త జట్లు ఏవి? అనేది బీసీసీఐ ప్రకటించింది. ఈ కొత్త జట్ల కోసం బిడ్డింగ్ ను నిర్వహించింది. అందులో ఐపీఎల్ లో కొత్త జట్లను సీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్స్, ఆర్పీఎస్జీ గ్రూప్ కొనుగోలు చేసాయి.
Read Also : అందుకే పాకిస్థాన్ పై ఓడిపోయాం : కోహ్లీ
ఇక ఈ బిడ్డింగ్ లో అత్యధికంగా 7,090 కోట్లు వేసి ఒక్క జట్టును సొంతం చేసుకోగా… మరోవైపు అత్యధికంగా 5,600 కోట్లు బిడ్డింగ్ చేసిన సీవీసీ క్యాపిటల్స్ రెండవ జట్టును కైవసం చేసుకుంది. అయితే ఈ బిడ్డింగ్ లో గెలిచిన వారి కోసం బీసీసీఐ అహ్మదాబాద్, లక్నో, కటక్, ధర్మశాల, గౌహతి మరియు ఇండోర్ రూపంలో ఆరు కేంద్రాలను ఇచ్చింది. అందులో ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో ను తీసుకోగా… సీవీసీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ ను ఎంపిక చేసుకుంది.