భళా పంజాబ్ సీఎం: ఒకవైపు పాలన… మరోవైపు వంట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు నిత్యం ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబంతో గడిపేందుకు కూడా వారికి సమయం దొరకదు. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తులు ఎంత బిజీగా ఉంటారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ పాలన విషయంలో నిత్యం బిజీగా ఉండే పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ బుధవారం రోజుజ గరిటె పట్టాడు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా రకరకాల వంటలు చేశారు. మటన్ మసాలా, చికెన్, ఆలూ కుర్మా, బిర్యానీ వంటి పలు రకాల పసైందైన వంటలు చేశారు. అలా తయారు చేసిన వంటలను ముఖ్యమైన అతిథులకు స్వయంగా వడ్డించారు. ఇంతకీ ఆ ముఖ్యమైన అతిథులు ఎవరూ అంటే, ఇటీవలే ముగిసిన ఒలింపిక్స్లో పాల్గోన్న క్రీడాకారులు. జావెలింగ్ త్రో విభాగంలో రికార్డులు సృష్టించి స్వర్ణపతకం గెలుచుకున్న నీరజ్ చోప్రాతో పాటుగా, పంజాబ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి విందును ఏర్పాటు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన పురుషుల, మహిళల హాకీ క్రీడాకారులు, ఇతర అథ్లెట్స్ ఈ విందులో పాల్గొన్నారు. దేశానికి కీర్తి తీసుకురావడం కోసం క్రీడాకారులు ఎంతగానో శ్రమిస్తారు. వారి ముందు నేను చేసింది చాలా తక్కువే అని సీఎం అమరిందర్ సింగ్ పేర్కొన్నారు.
Read: గుంటూరు జిల్లాలో దారుణం: భర్తను బెదిరించి మహిళపై అత్యాచారం…
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..