Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Priyanka Gandhi Participating Helps Which Party In Uttar Pradesh Elections

యూపీలో ప్రియాంకం ఎవరికి లాభం…?

Published Date :October 9, 2021 , 5:58 pm
By Manohar
యూపీలో ప్రియాంకం ఎవరికి లాభం…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొద్ది రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్‌లో మార్మోగుతున్న పేరు..ప్రియాంకా గాంధీ. హింసాకాండ జరిగిన లఖింపూర్ వెళుతుండగా మార్గ మధ్యలో సీతాపూర్‌ వద్ద యూపీ పోలీసులు ఆమెను ఆదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమెను ఉంచిన గెస్ట్ హౌస్‌ గదిని చీపురు పట్టి ఆమే శుభ్రం చేసుకున్నారు. అదే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తరువాత సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లఖింపూర్ వెళ్లారు. శుక్రవారం స్థానిక వాల్మీకి కాలనీలో మళ్లీ చీపురుతో కనిపించారు. ఈసారి ఆమె రోడ్డు ఊడ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో ఆదివారం మెగా ర్యాలీకి ప్లాన్ చేశారు. ఇదంతా చూస్తుంటే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవం కోసం చేస్తున్న ప్రయత్నమని అనిపించవచ్చు.

యూపీ రాజకీయాలలో ప్రియాంకని ఎక్కువ చేసి చూపించటాన్ని బీజేపీ పెద్దగా పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో ప్రియాంక ఫ్యాక్టర్‌ ఉంది అనేలా చేయటం కూడా బీజేపీ వ్యూహాత్మక వ్యూహమేనా అనిపిస్తుంది. ఎందుకంటే..ఇక్కడ బిజెపి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు సమాజ్‌వాది పార్టీ , బిఎస్‌పిలు.. ఓటు బేస్‌ లేని కాంగ్రెస్‌ ప్రభావం ఎన్నికల్లో ఉండదని బావిస్తున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని అవి ఇప్పటికే తెగేసి చెప్పాయి. అయితే ప్రియాంక ఫ్యాక్టర్‌తో రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్లు కొద్దొ గొప్పో పెరిగినా దాని వల్ల ఎస్పీ, బీఎస్పీలకే నష్టం కలుగుతుందన్నది బీజేపీ ఎత్తుగడలా కనిపిస్తోంది.

Also Read

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం
  • Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం

నిజానికి 2014, 2017, 2019లో జరిగిన ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌ లోని అగ్ర వర్ణ కులాలు, ముస్లింలు కొంత వరకు కాంగ్రెస్‌కు ఓటేశారు. అయితే ప్రభావం చూపే స్థాయిలో లేరు. ఇప్పుడు అగ్రవర్ణ ఓటర్లు బీజేపీరి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. పలు కారణాల వల్ల అగ్రవర్ణాలు.. ముఖ్యంగా బ్రాహ్మణులు బీజేపీకి దూరం కావచ్చని ఆ పార్టీ కలత చెందుతోంది. వారు తమకు ఓటు వేయని పక్షంలో ఎస్‌పి, బిఎస్‌పికి కాకుండా కాంగ్రెస్‌ వైపు వెళ్లేలా చూసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నంలా ఇది కనిపిస్తోంది. అలాగే ముస్లింలు ఓట్ల చీలికకు కూడా ప్రియాంక ఫ్యాక్టర్ పనికి వస్తుంది. అందుకే ఆమెకు యూపీలో స్పేస్‌ కల్పించటం బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది.

బీఎస్‌పీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ లఖింపూర్‌ హింసాకాండలో చనిపోయిన బ్రాహ్మణ కుటుంబాలను ఎందుకు పరామర్శించ లేదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఆ మాటల వెనక పరమార్థం కూడా అగ్రవర్ణ ఓటర్లే. ప్రియాంక చీపురు పట్టటంపై కూడా ఆయన చవకబారు కామెంట్‌ చేశారు. ప్రజలు ఆమెను అక్కడికి దిగజార్చారని వ్యాఖ్యానించటం ఆమె స్థాయిని కాదు ఆయన స్థాయిని తగ్గించిందంటోంది కాంగ్రెస్. యోగీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు కూడా దిగుతోంది. దళితులు, మహిళలను ముఖ్యమంత్రి అవమానించారంటూ రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

ఏదేమైనా, లఖింపూర్ ఎపిసోడ్‌లో ఎస్‌పి,బిఎస్‌పి రెండూ వెనుకబడినట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎపిసోడ్‌ని బిజెపి,కాంగ్రెస్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటూ ఈ పార్టీలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. సీతాపూర్ వరకు ప్రియాంకను ఎలా అనుమతించారు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు అఖిలేష్‌ని కనీసం తన నివాసం నుండి బయటకు వెళ్లడానికి కూడా అనుమతించలేదు అలాంటి ప్రియాంకను ఎందుకు ముందే అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కానీ..కాంగ్రెస్‌ బలం పుంజుకుంటే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అది బీజేపీని కూడా దెబ్బతీస్తుందా ..లేదంటే కేవలం ఎస్పీ , బీఎస్పీలకే నష్టం కలిగించటానికే పరిమితమవుతుందా?

చరిత్రను చూస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో యూపీకి ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ రాజకీయాల్లో ప్రవేశించారు. రాహుల్ గాంధీతో లక్నోలో పెద్ద రోడ్ షో నిర్వహించారు. ఎస్‌పి-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయగా కాంగ్రెస్ ఒంటరిగా పోరాడింది. ప్రతిపక్ష కూటమి 80 సీట్లలో 15 సీట్లను మాత్రమే గెలుచుకోగా, కాంగ్రెస్ రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేథిని కూడా కోల్పోయింది. రాయ్ బరేలీలో మాత్రం సోనియా గాంధీ గెలిచారు.

అయితే, ఆ ఎన్నికల ద్వారా కీలక లెక్కలు బిజెపికి తెలిసొచ్చాయి. దాదాపు 10 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ కారణంగా ఎస్‌పి-బిఎస్‌పి-ఆర్‌ఎల్‌డి కూటమి కోల్పోయింది. ఎందుకంటే ఈ స్థానాల్లో బిజెపి అభ్యర్థుల గెలుపు మార్జిన్లు కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్ల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ కేవలం ఒక సీటు మాత్రమే గెలిచి ఉండవచ్చు. పోటీ చేసిన స్థానాల్లో చాలా వరకు డిపాజిట్లు కోల్పోయి వుండవచ్చు. కానీ కీలకమైన ఓట్లు సాధించి ప్రత్యర్థి కూటమిని బాగా దెబ్బతీసింది. తమ పార్టీ కొద్దో గొప్పో సీట్లు సాధిస్తుందని ప్రియాంక అనుకున్నారు..కానీ ఆమె ప్రచారం పరోక్షంగా చివరకు బీజేపీకే లాభించిందని ఫలితాలు నిరూపించాయి. బహుశా 2022లోనూ అది పునరావృతం అవుతుందని బీజేపీ ఆశ కావచ్చు.

2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 28 సీట్లు గెలిచింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పనితీరును మెరుగుపరచడానికి రాహుల్ గాంధీ .. బాలకోట్ దాడులు జరగడానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా ఖాట్ యాత్ర చేశారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. అయినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఏడు స్థానాలకు పడిపోయింది. సంస్థాగతంగా యూపీలో బిజెపి బలమైన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ ‘వెనక్కి తగ్గినట్లు’ కనిపిస్తే .. బలహీనమైన కాంగ్రెస్ అత్యంత దూకుడుగా కనిపిస్తుంది. ఈ దూకుడు 2022 ఎన్నికల్లో ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాల్సివుంది.

— Dr. Ramesh Babu Bhonagari

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Priyanka Gandhi
  • Uttar Pradesh
  • uttar pradesh elections

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions