అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ భేటీ.. వాడివేడి చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భేటీ అయింది. విద్యుత్ కొనుగోళ్లు-ప్రభుత్వ సబ్సిడీలపై పీఏసీలో చర్చ జరుగుతోంది. కోవిడ్ కారణంగా సమావేశానికి హాజరు కాలేదు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి. ఇతర అధికారులతో పీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై పీఏసీలో వాడీ వేడీ చర్చ సాగుతోంది.
సోలార్ విద్యుత్ కొనుగోళ్లల్లో లోపాలను ప్రస్తావించారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల. సెకీ టెండర్లను రూ. 2.49కే ఖరారు చేశారా..? అంతకు మించి ఎక్కువగా ఖర్చు అవుతుందా అని ప్రశ్నించిన పయ్యావుల. సరైన సమాచారంతో మళ్లీ వస్తామంది అధికారులు. సంతకాలు.. ఒప్పందాలు చేసేసుకుని సమాచారం లేదంటే.. కమిటీకి సమాచారం ఇవ్వకుండా గోప్యత ప్రదర్శించడమేనన్న పయ్యావుల.
Also Read
ప్రజలకే కాకుండా.. అసెంబ్లీ కమిటీలకు కూడా సమాచారం ఇవ్వరా అంటూ మండిపడ్డారు పయ్యావుల. రూ. 2.49 కంటే అదనంగా ఖర్చు అవుతుందంటూ అంశాల వారీగా లెక్కలు వివరించారు పీఏసీ ఛైర్మన్. కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, ఐఎస్టీఎస్సుకు ప్రత్యామ్నాయంగా జరిపే చెల్లింపులు, కేంద్ర, రాష్ట్ర గ్రిడ్ల అభివృద్దికి ఒక్కొ యూనిట్టుకు ఎంత ఖర్చవుతుందో లెక్క వేసి చూపించారు పయ్యావుల. సుమారు రూ. 1కు పైగానే అదనపు ఖర్చు అవుతుందని అంగీకరించారు అధికారులు.
కమిటీలో చెప్పిన ప్రతి మాట ఆన్ రికార్డేననే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు పయ్యావుల. అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సమాచారం తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు పయ్యావుల కేశవ్. తర్వాత సమావేశానికి పక్కా సమాచారంతో రావాలంటూ స్పష్టం చేశారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల.
తాజావార్తలు
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!