Upendra Kushwaha: 2024లోనూ ప్రధాని మోడీకి ఎదురు లేదు.. నితీష్ ప్రయత్నం వృధానే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను గద్దె దింపాలని విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం విపక్ష పార్టీలన్ని ఐక్యంగా పోరాడాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు వేశారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్సీపీ నేతలను కలిసి చర్చించారు. 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ఉమ్మడిగా పోరాడాలని భావిస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లోనూ మోడీకి ఎలాంటి ఢోకా లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ కు సన్నిహితుడిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:Karnataka elections: ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున బరిలోకి ఫిల్మ్ డైరెక్టర్!
జేడీ(యూ) పార్లమెంటరీ బోర్డు మాజీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సవాల్ లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన కుష్వాహా.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విపక్ష ఐక్యత సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలను అపహాస్యం చేశారు. రాష్ట్రంలో పొత్తు ఉన్న జెడి(యు) అత్యున్నత నాయకుడితో ఆ పార్టీలు మాత్రమే ఉన్నాయి.
Also Read:AHA: లాస్యప్రియ గాత్రానికి హరీశ్ రావు ఫిదా!
Also Read
- China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
కొన్ని నెలల క్రితం జెడి(యు)తో తెగతెంపులు చేసుకుని రాష్ట్రీయ లోక్ జనతాదళ్ను ఏర్పాటు చేసిన కుష్వాహా, ఎన్డిఎలోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఈ విషయంపై తర్వలో ప్రకటన చేస్తానని కుష్వాహా తెలిపారు. కుష్వాహా గతంలో NDA మిత్రపక్షంగా ఉన్నారు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. నరేంద్ర మోడీ తొలి మంత్రివర్గంలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే, 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బిజెపి నేతృత్వంలోని సంకీర్ణాన్ని విడిచిపెట్టి, ఆర్జెడి, కాంగ్రెస్, కొన్ని ఇతర చిన్న పార్టీలతో ఏర్పాడిన ‘మహాఘట్ బంధన్’ తో కూటమిలో ఉన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?