ఏపీలో జగన్ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా కేంద్రాల వల్ల విప్లవం రాబోతోందన్నారు వ్యవసాయమంత్రి కన్నబాబు. అర్భీకేలు బలమైన వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నాయి. ఎఫ్ఏఓ, ఐసిఏఆర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అర్భీకేలకు గుర్తింపు లభించిందన్నారు మంత్రి.
త్వరలోనే ఆర్గానిక్ పాలసీ తీసుకొని రాబోతున్నాం. అర్భీకేల ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రక్రియ ఉంటుంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎక్కడ ఇబ్బందులు లేవు. వర్షాలు వరదల వల్ల ధాన్యం రంగు మారింది. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. 2.60 లక్షల టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేశామన్నారు మంత్రి కన్నబాబు.
రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. కేంద్రం ఇచ్చే గైడ్ లైన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. ధాన్యం మొత్తాన్నీ అర్భీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. త్వరలోనూ చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చెల్లింపులు కూడా నేరుగా రైతుల అకౌంట్లల్లోనే వేస్తాం. రైతులకు పూర్తిగా గిట్టుబాటు ధర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు మంత్రి కన్నబాబు.