Mukesh Ambani: శాలరీ తీసుకోని ముఖేష్ అంబానీ. ఇది వరుసగా రెండో ఏడాది కావటం విశేషం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రిల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ముఖేష్ అంబానీ వరుసగా రెండో ఏడాదీ వేతనం తీసుకోలేదు. 2020లో కొవిడ్ వైరస్ మహమ్మారి విజృంభించడంతో ఎకానమీ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ నేపథ్యంలో ఆయన 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి శాలరీని స్వచ్ఛందంగా వదలుకున్నారు. 2021-2022లో కూడా ముఖేష్ అంబానీ వేతనం తీసుకోలేదని రిలయెన్స్ సంస్థ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
ఇదే కాదు. శాలరీ విషయంలో ముఖేష్ అంబానీ 2008లో కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు. అలవెన్సులు, ఇన్సెంటివ్స్, రిటైరల్ బెనెఫిట్స్ అన్నీ కలిపి వార్షిక వేతనం 15 కోట్ల రూపాయలకు మించి తీసుకోనని తేల్చిచెప్పారు. 2020 వరకు కూడా అదే ఫాలో అయ్యారు. ఆ సంవత్సరం నుంచి అసలే తీసుకోవటం మానేశారు. రిలయెన్స్ గ్రూపులోని కొన్ని కంపెనీల వారసత్వాన్ని ఇటీవలే తన కుమారుడికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే.
Also Read
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
UDAN Scheme: ఉడాన్ పథకం ఘనత. ఐదేళ్లలో లక్షన్నరకు పైగా విమానాలు ప్రారంభం.
రూ.6.42 ట్రిలియన్ల రికవరీ
ప్రభుత్వ రంగ బ్యాంకులు 2014-22 మధ్య కాలంలో 6.42 ట్రిలియన్ల రూపాయలు రికవరీ చేశాయి. మొండి బకాయిలు (ఎన్పీఏలు), సాంకేతికంగా రద్దు చేసిన (రిటన్ ఆఫ్) లోన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. 98.5 శాతం మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కోర్టుల్లో కేసులు వేశాయి. ఇదిలాఉండగా 2015-21 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.36 ట్రిలియన్లు సమకూర్చింది. మూలధనం కింద వీటిని అందజేసింది. మరో వైపు మార్కెట్ల నుంచి రూ.2.99 ట్రిలియన్లు సేకరించింది.
గ్రేట్ ‘అప్గ్రాడ్’
ఆన్లైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫాం అయిన అప్గ్రాడ్.. రూ.1,670 కోట్ల నిధులను సమీకరించింది. వివిధ ఎడ్టెక్ సంస్థలు తీవ్ర నిధుల లేమితోపాటు వివిధ కారణాల వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేస్తున్న నేపథ్యంలో అప్గ్రాడ్ ఈ స్థాయిలో రాణించటం విశేషమనే చెప్పాలి. అంతేకాదు. ఈ ఆర్థిక సంవత్సరంలో వార్షిక స్థూల ఆదాయం రూ.400-500 కోట్లు నమోదు చేస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది. అప్గ్రాడ్కి 30 లక్షలకు పైగా లెర్నర్ బేస్ ఉండటం గమనార్హం.
‘టాటా’ చేతికి ‘ఫోర్డ్’
గుజరాత్లోని సనంద్ సిటీలో ఉన్న ఫోర్డ్ ఇండియా ప్లాంట్ను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.725.7 కోట్లు. ఈ రెండు సంస్థల తయారీ యూనిట్లు సనంద్లో పక్కపక్కనే ఉండటం గమనార్హం. యూనిట్ ట్రాన్స్ఫర్ ఒప్పందంపై రెండు కంపెనీలు ఇవాళే సంతకాలు చేశాయి. అర్హులైన ఫోర్డ్ సిబ్బందికి తమ దగ్గర ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ప్రకటించింది. ఈ రెండు సంస్థలు ఒక్కటి కావటంతో ప్రయాణికుల వాహనాల విభాగంలో ఇక ‘టాటా’ బలమైన ముద్ర వేయనుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!