ఖరీదైన విడాకులు.. భరణంగా రూ.5,555 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విడాకుల తర్వాత భార్యకు భరణం చెల్లించే విషయంలోనూ కొత్త రికార్డు సృష్టించాడు దుబాయ్కి చెందిన ఓ రాజు.. బ్రిటన్ హైకోర్టు వెలువరించిన సంచలన తీర్పుతో.. ఆయన తన మాజీ భార్యకు ఏకంగా రూ.5,555 కోట్లను భరణంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం వయస్సు 72 ఏళ్లు.. ఆయన భార్య జోర్డాన్ రాకుమారి హయా బింత్ అల్ హుసేన్ వయస్సు 47 ఏళ్లు.. ఈ ఇద్దరి విడాకుల కేసు విచారణ జరిపిన బ్రిటన్ హైకోర్టు.. తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. షేక్ మహమ్మద్-హయాకు పుట్టిన పిల్లలకు 554 మిలియన్ పౌండ్లు భరణంగా చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పు చెప్పింది.. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం.. ఆ మొత్తం రూ.5,555 కోట్లు అన్నమాట.
Read Also: చలిపంజా.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. 4.6గా కనిష్ఠ ఉష్ణోగ్రత..
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
బ్రిటిష్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన విడాకులు ఇవేనని చెబుతున్నారు.. ఇక, ఈ మొత్తంలో మొదట రూ.2,521 కోట్లు మాజీ భార్యకు 3 నెలల్లోపు చెల్లించాలని.. మిగతా రూ.2,907 కోట్లు వారి ఇద్దరి సంతానమైన 14 ఏళ్ల అల్ జలీలా, 9 ఏళ్ల జయేద్కు బ్యాంకు గ్యారంటీతో చెల్లించాలని తన తీర్పులో స్పష్టం చేసింది బ్రిటన్ కోర్టు.. అంతేకాదు.. పిల్లలకు ఇవ్వాల్సిన మొత్తం తండ్రితో వారికున్న సంబంధాలపై ఆధారపడి ఉంటుందని కూడా పేర్కొంది.. మాజీ భార్య, పిల్లల రక్షణ ఖర్చుల కింద ప్రతీ ఏడాది రూ.110 కోట్లు, పిల్లల చదువుల కోసం మరికొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.. ఈ కేసు విచారణ తర్వాత తీర్పు వెలువరించిన కోర్టు.. రాకుమారి హయా, ఆమె పిల్లలకు బయటి వ్యక్తుల నుంచి కంటే భర్త షేక్ మహమ్మద్ నుంచే ఎక్కువ ముప్పు ఉందని అర్థమవుతోందని.. వారికి తగినంత రక్షణ అవసరమని పేర్కొంది. కాగా, రాకుమారి హయా 2019లో దుబాయ్ నుంచి తిరిగి లండన్కు వెళ్లిపోయారు.. ఆ తర్వాత విడాకుల కోసం కోర్టుకెక్కారు.. తన ఇద్దరు పిల్లలను అప్పగించాలని బ్రిటిష్ కోర్టును ఆశ్రయించారామె.. అప్పటి నుంచి విచారణ జరుగుతూ రాగా.. తాజాగా సంచలన తీర్పు వెలువరించింది హైకోర్టు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!