BJP: అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. ఆ రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ బీజేపీకి కొత్త చీఫ్గా సీపీ జోషి ఎన్నికయ్యారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్లో ఈసారి అధికారం చేపట్టాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు వ్యూహాలు రచిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడిగా లోక్సభ ఎంపీ సీపీ జోషిని నియమించింది. బ్రాహ్మణ ఓట్లను ఆకర్షించడానికి జోషిని నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహాంలో భాగమే అనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: TSRTC : ప్రయాణికులకు గుడ్న్యూస్.. టీఎస్ఆర్టీసీ మరో నిర్ణయం
రాజస్థాన్లో రెండు ప్రధాన కులాలు ఉన్నాయి. రాజ్పుత్లు, జాట్ల ఓట్లే ఎన్నికల్లో కీలకంగా మారుతాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. చిత్తోర్గఢ్ లోక్సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన 47 ఏళ్ల జోషి.. గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లో అత్యధిక ఓట్లతో గెలుపొందిన రాజకీయ నాయకుడిగా రికార్డు సృష్టించారు. రాజస్థాన్ బీజేపీలోని ఏ వర్గంతోనూ పొత్తుపెట్టుకోని ఆయన పార్టీలకతీతంగా ఉంటారని భావిస్తున్నారు. అతను రాజస్థాన్లో బిజెపికి అతిపెద్ద క్రౌడ్-పుల్లర్ అయిన మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో సన్నిహితంగా లేరు.
Also Read: Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్కు అరుదైన గౌవరం.. చరిత్ర సృష్టించిన బాబర్
Also Read
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. గత రాష్ట్ర అధ్యక్షుడి పదవీకాలం ఇప్పటికే ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేశారు. కొత్త నాయకుడి నేతృత్వంలో పార్టీకి కొత్త శక్తి వస్తోందని బిజెపి నాయకత్వం భావిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్, ఒడిశా, ఢిల్లీలో కొత్త రాష్ట్ర అధ్యక్షులను కూడా బీజేపీ నియమించింది. ఇతర వెనుకబడిన వర్గ నాయకుడు, శాసన మండలి సభ్యుడు సామ్రాట్ చౌదరి పార్టీ బీహార్ విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. మాజీ రాష్ట్ర మంత్రి మన్మోహన్ సమాల్ ఒడిశాలో పార్టీకి నాయకత్వం వహిస్తారు. ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవా రాజధానిలో పార్టీ చీఫ్గా ఎదిగారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!