Ghulam Nabi Azad: మోదీ రాజనీతిజ్ఞుడు.. ప్రధానిపై మాజీ కాంగ్రెస్ నేత ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మాజీ నాయకుడు, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డిపిఎపి) చీఫ్ గులాం నబీ ఆజాద్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేసినా తనపై ప్రతీకారం తీర్చుకోకుండా, రాజనీతిజ్ఞుడిగా ఉన్నందుకు ఆయనకు క్రెడిట్ తప్పక ఇవ్వాలని ఆయన అన్నారు.
Also Read:Swastika Mukherjee: ఆ నిర్మాత నా నగ్న ఫోటోలను పోర్న్ వెబ్ సైట్ లో పెడతానని బెదిరించాడు
“నేను మోడీకి తప్పక క్రెడిట్ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆర్టికల్ 370 లేదా CAA లేదా హిజాబ్ ఏ విషయంలోనూ అతనిని విడిచిపెట్టలేదు. కొన్ని బిల్లులు పూర్తిగా విఫలమయ్యాయి. కానీ అతను దానికి ప్రతీకారం తీర్చుకోకుండా రాజనీతిజ్ఞుడిగా ప్రవర్తించారు” అని గులాం నబీ ఆజాద్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. G23 (కాంగ్రెస్ సీనియర్ నేతల రెబల్ గ్రూప్)కి బీజేపీతో సాన్నిహిత్యం ఉందా అనే అంశంపై గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ.. ‘అది మూర్ఖత్వం. G23 బీజేపీ అధికార ప్రతినిధి అయితే కాంగ్రెస్ వారిని ఎంపీలుగా ఎందుకు చేసింది? ఎంపీలు, ప్రధాన కార్యదర్శులు, ఆఫీస్ బేరర్లా? నేను ఒక్కడినే పార్టీని స్థాపించాను. మిగిలిన వారంతా ఇప్పటికీ ఉన్నారు. ఇది అవివేకం, అపరిపక్వత, చిన్నపిల్లల ఆరోపణ” అంటూ కొట్టిపారేశారు.
Also Read:Limca Book of Records : ఎంపీ సంతోష్ కుమార్కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
Also Read
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
మునుపటి తరం కాంగ్రెస్ దిగ్గజాల గురించి ఆజాద్ మాట్లాడుతూ, “నెహ్రూ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకోగలిగారు. వారికి ఓర్పు ఉంది. వారికి ప్రజల మద్దతు కూడా ఉంది.కొంత కాలం పాటు వారి పనితో వారు పుంజుకోగలిగారు.కానీ ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు” అని ఆజాద్ అభిప్రాయపడ్డారు. నాయకత్వంతో కొన్ని విభేదాలు ఉండవచ్చు, కానీ తను కాంగ్రెస్ పార్టీతో లేదా కాంగ్రెస్ సిద్ధాంతంతో విభేదాలు లేవు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ భావజాలంతో లేదా మునుపటి కాంగ్రెస్ నాయకత్వంతో నాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అయితే నా పుస్తకంలో అక్కడక్కడా నెహ్రూ, ఇందిరా, రాజీవ్జీ కాలంలో జరిగిన తప్పులను ప్రస్తావించాను. కానీ వాళ్లు పెద్ద నాయకులే అని కూడా చెప్పాను అని ఆజాద్ గుర్తు చేశారు.
కాగా, కాంగ్రెస్ తో ఐదు దశాబ్దాలుగా ఉన్న తన అనుబంధాన్ని తెంచుకున్న ఆజాద్.. గతేడాది సెప్టెంబర్ 26 ,2022న “డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ”ని ప్రకటించారు. పార్టీకి ఏజ్ బార్ ఉండదని,యువకులు- అనుభవజ్ఞులు పార్టీలో కలిసి ఉంటారని ఆజాద్ చెప్పారు.
I must give credit to Modi for what I did to him. He was too generous. As Leader of the Opposition I did not spare him on any issue be it Article 370 or CAA or hijab. I got some bills totally failed but I must give him the credit that he behaved like a statesman, not taking… pic.twitter.com/RFyd6PYwU8
— ANI (@ANI) April 4, 2023
తాజావార్తలు
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!