బాలరాజు బాధ ఇంతింతకాదయా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవును ఒక్క సవాల్ ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతోంది. రాజకీయాల్లోకి వచ్చాక సవాలక్ష సవాళ్ళు, ఆరోపణలు చేస్తుంటాం. అంత మాత్రాన మాట మీద నిలబడమంటే ఎలా. అచ్చం ఇలాంటి బాధలోనే వున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా బాలరాజు చేసిన సవాల్ ఆయన పాలిట శాపంగా మారింది. రాజకీయనేతలు తమ సవాళ్ళు మరిచిపోతారు కానీ ప్రజలు పట్టించుకున్నప్పుడే సమస్య వస్తుంటుంది. ఇప్పుడు అదే సమస్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వచ్చింది. ఆయన అన్న ఓ మాటను ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు. సోషల్ మీడియాలో అయితే అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా గువ్వల బాలరాజు సవాల్ విసిరారు. ఈటల అక్కడ గెలిస్తే రాజీనామా చేస్తానన్నారు. ఈటల గెలవడంతో ఆయన సవాల్ ని కొందరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మీరు రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ అదే పనిగా ఫోన్ చేసి మరీ అడుగుతుండడంతో తల పట్టుకుంటున్నారు ఎమ్మెల్యే బాలరాజు. ఈ ఫోన్ కాల్స్ దెబ్బకు ఆయనకు బీపీ పెరిగి అప్పుడప్పుడు కొంత మందిని చెడామడా తిట్టేస్తున్నారు. పాపం వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో బాలరాజు బాధ అంతా ఇంతా కాదు.
Also Read
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ఈటల గెలిస్తే రాజీనామా చేస్తానన్న గువ్వల బాలరాజు మాట నిలబెట్టుకోవాలని సోషల్ మీడియాలో క్యాంపైన్ నడుస్తోంది. గద్వాల నుండి ఓ బీజేపీ కార్యకర్త ఇలాగే ఫోన్ చేసి అడిగే సరికి ఆయన బీపీ పెరిగిపోయింది. ఆయన అనరాని మాటలన్నారు. ఆ ఆడియోను ఆయన ఆన్ లైన్లో పోస్ట్ చేశారు. అవన్నీ వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో అనేక మంది సవాళ్లు చేస్తారని అంత మాత్రాన ఇలా వెంట పడటం ఏమిటని బాలరాజు బాధపడుతున్నారు. ఈ బాధ పంచుకునేవారే కరువయ్యారు. ఈ ఫోన్ కాల్స్ దెబ్బతో ఆయన అసలు ఫోన్ తీయడానికి భయపడిపోతున్నారు.
ఇదిలా వుంటే.. ఎమ్మెల్యే గువ్వల బాల రాజుకి కాల్ చేసి అసభ్యంగా మాట్లాడి వాట్సప్ లో వైరల్ చేసిన హుజూరాబాద్ మండలం సింగపూర్ కు చెందిన కుమార్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు హుజూరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా పై నిఘా పెట్టామని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవంటున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!