టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించబోతోంది : మంత్రి సత్యవతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాదులో కోట్ల రూపాయల భూమిని ఇచ్చి ఇరవై అయిదు కోట్ల రూపాయల వ్యయంతో గిరిజన కొమురంభీమ్ భవనాన్ని నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం ఆమె నిర్మల్ జిల్లాలో మాట్లాడుతూ.. గిరిజన బిడ్డలు కోరుకున్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసామని, గిరిజనులు, పేదలను ఇన్ని రోజులు ఓట్ల సాధనాలుగానే చూశారని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో అరవై అయిదు సీట్లు ఇస్తే, అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎనభై అయిదు సీట్లను కట్టబెట్టే అధికారం ఇచ్చారన్నారు.
మూడోసారి సైతం బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చి టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించబోతోందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. పోడు రైతుల సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని, పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు త్వరలో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇస్తామని, ఆ భూములను అభివృద్ధి చేసి వాటికి నీటి సౌకర్యం కల్పించి సాగుకు యోగ్యంగా మారుస్తామన్నారు. వాటికి కూడా రైతుబంధు రైతు బీమా వర్తింప చేసేలా చూస్తామన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు రోజుకొకరు రాష్ట్రానికి వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారని, తెలంగాణ రాష్ట్ర పథకాలేమైనా వారి రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారా అని ఆమె విమర్శించారు.
Also Read
తాజావార్తలు
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!