మూడు రోజుల క్రితం కాబూల్ ఎయిర్ పోర్ట్ బయట జరిగిన బాంబు దాడుల్లో 160 మందికి పైగా పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈసారి రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక దేశాలు హెచ్చరించాయి. తమ దేశానికి చెందిన పౌరులు ఎవరూ కూడా ఎయిర్పోర్ట్ వైపు రావొద్దని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ముందస్తుగా హెచ్చరించాయి. హెచ్చరించినట్టుగానే ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఉగ్రవాదులు రాకెట్ లాంచర్లతో దాడులు చేశారు. అయితే, ఈ రాకె్ట్లు ఎయిర్పోర్టు సమీపంలోని జనావాసాల ఇళ్లపై పడ్డాయి. దీంతో ఆప్రాంతం మొత్తం దట్టంగా పొగ కమ్మేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయని స్థానిక మీడియా పేర్కొన్నది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అగ్రదేశాలు హెచ్చరిస్తుండడంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
Read: రూ. 3వేలు పెట్టి ఫుడ్ ఆర్డర్ చేస్తే… ఏం తెచ్చారో తెలుసా…!!