Manager Assaulted: దొంగతనం అనుమానంతో దాడి.. మృతదేహాన్ని ఆస్పత్రిలో పడేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో దారుణం జరిగింది. దొంగతనం అనుమానంతో 32 ఏళ్ల వ్యక్తిని అతని యజమాని ఆదేశాల మేరకు కొట్టి చంపారు. అతని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో బయట పడేశారు. షాజహాన్పూర్కు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలు, బంకిమ్ సూరి, నీరజ్ గుప్తాలపై హత్య ఆరోపణలు వచ్చాయి. రవాణా వ్యాపారి బంకిమ్ సూరి దగ్గర శివం జోహ్రీ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇటీవల కన్హియా హోజరీ యొక్క ప్యాకేజీ కనిపించకుండా పోయింది. దొంగతనం చేశారనే అనుమానంతో పలువురు ట్రాన్స్పోర్టర్ల ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయిన తర్వాత హత్య కేసులో ఏడుగురి పేరు పెట్టారు. ఓ వ్యక్తి రాడ్తో పదే పదే కొట్టడంతో శివం నొప్పితో కొట్టుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది. మేనేజర్పై దొంగతనం ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.
Also Read:Experts Tips: వేసవిలో గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోయిందా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శివం మృతదేహాన్ని మంగళవారం రాత్రి వైద్య కళాశాల ఆసుపత్రిలో వదిలివేయగా, విద్యుదాఘాతంతో మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక పోలీసు అధికారి ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించినప్పుడు, అతను విద్యుదాఘాతం కాదని గుర్తించారు. గాయాల కారణంగానే మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ట్రాన్స్పోర్ట్ వ్యాపారి బంకిం సూరి దగ్గర గత ఏడేళ్లుగా శివమ్ పనిచేస్తున్నట్లు ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలింది.
Also Read:Shahid Kapoor: సల్మాన్ డైరెక్టర్ తో షాహిద్ సినిమా… త్వరలో టీజర్
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
హత్య కేసులో ఏడుగురు నిందితుల్లో కన్హియా హోసిరీ యజమాని నీరజ్ గుప్తా కూడా ఉన్నారు. కన్హియా హోసిరీ ప్రాంగణంలో ఒక కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Warning: Disturbing video
In a UP shocker, 4 workers including a manager at a transport company were allegedly held captive, flogged and brutally tortured on suspicion of theft in Shahjahanpur district. Manager Shivam Johri (in the video) succumbed to the brutal torture. pic.twitter.com/ThH9lv23Oq
— Piyush Rai (@Benarasiyaa) April 13, 2023
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?