కరోనా కారణంగా తగ్గిపోయిన భారతీయుల ఆయుష్షు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఎందరో జీవితాలు కకావికలం అయ్యాయి. కరోనా కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు ఉపాధి కోల్పోయారు. అంతేకాకుండా కరోనా మనిషి సగటు ఆయువులో కూడా కోత పెట్టేసింది. సాధారణంగా గతంలో ఓ మనిషి ఆరోగ్యంగా ఉంటే వందేళ్లు జీవించేవాడు. కానీ మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి సగటు ఆయువు తగ్గిపోయింది. అది చాలదన్నట్లుగా ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చి ఇంకా ఆయువులో కోత పెట్టిందని పరిశోధకులు చెప్తున్నారు. ఇటీవల ముంబైలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ (ఐఐపీఎస్) చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
Read Also: ఒకరిని ప్రేమించి.. మరొకరితో పెళ్లి.. యువతి నిరసన
Also Read
ప్రజలపై కరోనా మహమ్మారి ఎంత మేరకు ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మరణాలను వారిని పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా ముఖ్యంగా 35 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న పురుషులపై ప్రభావం అధికంగా చూపిందని.. మృతుల్లో ఎక్కువగా ఈ వయసున్న పురుషులే ఉన్నారని పరిశోధకులు తెలిపారు. కరోనా రాకముందు అంటే 2019లో పురుషుల సగటు ఆయువు 69.5 ఏళ్లు, మహిళల సగటు ఆయువు 72 ఏళ్లు ఉండేది. అయితే కరోనా కారణంగా పురుషులు, మహిళల సగటు ఆయువు దాదాపు రెండేళ్లు తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు పురుషుల సగటు ఆయువు 67.5 ఏళ్లకు, మహిళల సగటు ఆయువు 70 ఏళ్లకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఆయుష్షు తగ్గడం తాత్కాలికమేనని, మళ్లీ ఇది మెరుగవుతుందని తాము ఆశిస్తున్నట్లు ఐఐపీఎస్ డైరెక్టర్ జేమ్స్ తెలియజేశారు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!