కరోనా కారణంగా తగ్గిపోయిన భారతీయుల ఆయుష్షు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఎందరో జీవితాలు కకావికలం అయ్యాయి. కరోనా కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు ఉపాధి కోల్పోయారు. అంతేకాకుండా కరోనా మనిషి సగటు ఆయువులో కూడా కోత పెట్టేసింది. సాధారణంగా గతంలో ఓ మనిషి ఆరోగ్యంగా ఉంటే వందేళ్లు జీవించేవాడు. కానీ మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి సగటు ఆయువు తగ్గిపోయింది. అది చాలదన్నట్లుగా ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చి ఇంకా ఆయువులో కోత పెట్టిందని పరిశోధకులు చెప్తున్నారు. ఇటీవల ముంబైలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ (ఐఐపీఎస్) చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
Read Also: ఒకరిని ప్రేమించి.. మరొకరితో పెళ్లి.. యువతి నిరసన
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ప్రజలపై కరోనా మహమ్మారి ఎంత మేరకు ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మరణాలను వారిని పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా ముఖ్యంగా 35 ఏళ్ల నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న పురుషులపై ప్రభావం అధికంగా చూపిందని.. మృతుల్లో ఎక్కువగా ఈ వయసున్న పురుషులే ఉన్నారని పరిశోధకులు తెలిపారు. కరోనా రాకముందు అంటే 2019లో పురుషుల సగటు ఆయువు 69.5 ఏళ్లు, మహిళల సగటు ఆయువు 72 ఏళ్లు ఉండేది. అయితే కరోనా కారణంగా పురుషులు, మహిళల సగటు ఆయువు దాదాపు రెండేళ్లు తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు పురుషుల సగటు ఆయువు 67.5 ఏళ్లకు, మహిళల సగటు ఆయువు 70 ఏళ్లకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఆయుష్షు తగ్గడం తాత్కాలికమేనని, మళ్లీ ఇది మెరుగవుతుందని తాము ఆశిస్తున్నట్లు ఐఐపీఎస్ డైరెక్టర్ జేమ్స్ తెలియజేశారు.
తాజావార్తలు
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
ట్రెండింగ్
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!