కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన వరిదీక్షకు దిగింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఇందిరాపార్క్ దీక్షలో సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. సీఎం కేసీఆర్ని అడ్డుకోవాలన్నారు. టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. పదవుల గురించి తాను పనిచేయడం లేదన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ, రేపు ధర్నాచౌక్లో ‘వరి దీక్ష’ చేపట్టింది.
ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలయికతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయ్యింది. రైతుల కోసం అంతా కలిసి కట్టుగా పనిచేస్తామన్నారు. రైతులు, అంతా కలిస్తేనే మేమంతా వున్నాం. ఎంపీలుగా గెలిచామంటే అది ప్రజల చలవే. రైతులు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.