Karnataka Elections: సింగపూర్ చేరిన కర్ణాటక రాజకీయం.. జేడీఎస్ మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెస్ మంతనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ, మ్యాజిక్ ఫిగర్ 113 రాకపోవచ్చని, హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్ పాత్రను పోషించేందుకు సిద్ధం అయింది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే అధికారం ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమను సంప్రదించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు జేడీఎస్ చెబుతోంది. అయితే ఇటు బీజేపీ కానీ, అటు కాంగ్రెస్ కానీ జేడీయూ మాటల్ని పట్టించుకోలేదు. తాము ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని, స్వయంగా అధికారంలోకి వస్తామని చెబుతున్నాయి.
Read Also: Suman: స్టార్ హీరోకి కోడలిగా సుమన్ కూతురు..?
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ఇదిలా ఉంటే జేడీయూ నేత కుమారస్వామి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన దూతలు కూడా సింగపూర్ వెళ్లినట్లు సమాచారం. అక్కడే కుమారస్వామితో మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఎన్నికలు ముగిసిన తర్వాత కుమారస్వామి మాట్లాడుతూ.. తాము ‘కింగ్ మేకర్’ కాదని ‘కింగ్’ అవుతామంటూ వ్యాఖ్యానించాడు. బీజేపీ, కాంగ్రెస్ తో పోలిస్తే మెరుగైన సీట్లు వస్తాయని అన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ మాత్రం జేడీఎస్ తో పొత్తు ఉండదని అన్నారు.
కాంగ్రెస్కే మద్దతా..?
సరైన సమయంలో సరైన నిర్ణయం వెల్లడిస్తామని జేడీఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ అన్నారు. తమను బీజేపీ, కాంగ్రెస్ సంప్రదిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న కుమారస్వామి మే 13 ఫలితాలు విడుదలయ్యే రోజు బెంగళూర్ రానున్నారు. అయితే దీనిపై ఇప్పటికే జేడీఎస్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవేగౌడ అభిలాష మేరకు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చేందుకు జేడీఎస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే అవినీతి కేసుల్లో ఉన్న కుమారస్వామి కేంద్ర సంస్థల నుంచి ఉపశమనం పొందాలంటే బీజేపీకి సపోర్టు చేస్తారని మరికొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేపు ఫలితాలు వెలువడితే తప్పా.. కర్ణాటక రాజకీయం ఓ కొలిక్కి రాదు.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!