కేబినెట్ భారీ ప్రక్షాళన.. ఏకంగా 10 మంది మంత్రులు ఔట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడమే కాదు.. తనకు నచ్చిన టీమ్, తాను మెచ్చిన విధంగా పనిచేసే టీమ్ ఉండాలని అందరు సీఎంలు కోరుకుంటారు.. ఇక, జాతీయ పార్టీలు అయితే.. వివిధ సమీకరణలు చూసుకుని మంత్రి వర్గ విస్తరణ, ప్రక్షాళన చేపడుతుంటింది.. ఇక, నాలుగు నెలల క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై.. బీజేపీ హైకమాండ్ ఆదేశాలను మంత్రి వర్గ విస్తరణపై దృష్టిసారించారు.. తన కేబినెట్లో ప్రస్తుతం ఉన్న సుమారు 10 మంది పనితీరు బాగాలేదని బొమ్మై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటివారిని సాగనంపి కొత్తవారిని తీసుకోవాలని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ఈ మార్పులు ఉండే విధంగా ఆయన కసరత్తు చేస్తున్నారని టాక్..
Read Also: 700 మంది రైతులు అమరులైనా డేటా లేదా..?
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
అయితే.. కర్ణాటకలో ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో 25 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.. వాటి ఫలితాలు ఈ నెల 14వ తేదీన వెలువడనున్నాయి.. ఆ తర్వాత కేబినెట్లో కీలక మార్పులు జరగనున్నాయని సమాచారం.. కర్ణాటక కేబినెట్లో 34 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా 30 మంది మంత్రులు ఉన్నారు. దీంతో.. ఖాళీలు భర్తీ చేయడంతో పాటు.. కొంతమందిని పంపించే విధంగా కూడా కసరత్తు ప్రారంభించారు సీఎం బొమ్మై.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వారం తర్వాత, బొమ్మై ఆగస్టు 4న 29 మంది మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గాన్ని విస్తరించారు.. చాలా మంది ఆశావహులతో, బొమ్మై మంత్రివర్గాన్ని విస్తరించాలని, నాలుగు ఖాళీలను భర్తీ చేయాలని ఒత్తిడిలో ఉన్నారు.. ఇక, మొదటి నుండి బీజేపీలో కొనసాగుతున్న పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఆగస్టులో జరిగిన మంత్రివర్గ విస్తరణతో కలత చెందారు, ఎందుకంటే వారిని తప్పించడం.. బయటివారికి ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు.. దీంతో.. భారీ ప్రక్షాళన ఉంటుందని.. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేడీ(ఎస్) ఆరుగురు అభ్యర్థులను మాత్రమే నిలబెట్టగా, బీజేపీ, కాంగ్రెస్ 20 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి పెట్టాయి. మరి ఫలితాలు ఎలా ఉంటాయో..? కేబినెట్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
-
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
-
Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
-
Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి – బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!