మంత్రి తలసానికి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దని..తెలంగాణ ప్రజల ప్రాణాలతో కామెడీ చేయొద్దని చురకలు అంటించారు. సంగారెడ్డికి ఆసుపత్రికి రండి పోదామని.. కేసులు తగ్గాయని అని రుజువు చేస్తారా..? అని సవాల్ విసిరారు. సీఎం దగ్గర మంచి పెరుకోసం భజన చెయ్యకు.. కేంద్రం మీద కోట్లాది…రాష్ట్రంకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు.
అంత మోగొడివి అయితే కిషన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలని.. గాంధీ ఆసుపత్రికి పొయ్యి చూడాలని చురకలు అంటించారు.
రాష్ట్రంలో రెమిడేసివర్ ఇంజెక్షన్ కొరత ఎక్కువైందని.. కరోనా బాధితుల పేరెంట్స్ బ్లాక్ లో కొందాం అనుకున్న దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిత్యం 200 పై చిలుకు జనం చనిపోతున్నారని..కేంద్రం తెలంగాణను అశ్రద్ద చేస్తుందని ఫైర్ అయ్యారు. నలుగురు బీజేపీ ఎంపిలు, కేంద్రమంత్రి.. మోడీ దగ్గర కూర్చొని రెమిడేసివర్ సంఖ్య ఎందుకు పెంచడం లేదని నిలదీయాలని డిమాండ్ చేశారు. వేస్ట్ మాటలు చెబుతూ.. బీజేపీ రాజకీయం చేస్తుందని నిప్పులు చెరిగారు.