‘మెజార్టీ’ లెక్కలు తేలుస్తున్న సీఎం జగన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవ్యాంధ్రలో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీస్తుందనడానికి కిందటి సార్వత్రిక ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకానీ రీతిలో జగన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ ఏకంగా 151 సీట్లను సాధించి ఘనవిజయం సాధించింది.. వైసీపీకి ఈ గెలుపు చిరస్మరణీయమైన గుర్తుగా మిగిలిపోగా.. ప్రతిపక్షాలకు మాత్రం పీడకలను మిగిల్చాయి. నాడు మొదలైన వైసీపీ వేవ్ నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగింది.
రెండున్నేళ్ల తర్వాత సీఎం జగన్మోహన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే కేబినేట్ కూర్పుపై కసరత్తులు చేస్తున్నారు. ఈ టీంతో ఆయన వచ్చే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే ఆయన గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. జగన్ వేవ్ లోనూ గతంలో స్పల్ప మెజార్టీతో బయటపడిన ఎమ్మెల్యేల లిస్టును జగన్ రెడీ చేస్తున్నారని సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో వీరికి టిక్కెట్ దక్కకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Also Read
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు జగన్ ఇమేజ్ బలంగా పని చేసింది. జగన్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలని జనం భావించటం, టీడీపీపై వ్యతిరేకత కలిసి రావడంతో ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. చాలా నియోజకవర్గాల్లో కేవలం జగన్ ఫొటోను చూసే జనాల ఓట్లు పడ్డాయి. అయితే అంతటీ వేవ్ లోనూ కొంతమంది ఎమ్మెల్యేలు స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్లోలోకి వెళ్లారనే టాక్ విన్పిస్తోంది. దీంతో నాటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఆ ఎన్నికల్లో ఎవరెవరికి అత్యధిక మెజార్టీ వచ్చాయి? ఎవరికీ సల్ప మెజార్టీ వచ్చాయనే లెక్కలు తీస్తున్నారట. జగన్ వేవ్ లోనూ స్వల్ప మెజార్టీ వచ్చిందంటే వారిపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లేనని ఆయన భావిస్తున్నారు. దీంతో వారికి ఈసారి టిక్కెట్ ఇచ్చే అవకాశాలు తక్కువేనని ప్రచారం జరుగతోంది. టీడీపీ నుంచి బలమైన అభ్యర్థులు ఉన్నచోట్ల స్పల్ప మెజార్టీతో బయటపడిన వారిని ఈ లెక్కలోకి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. బలహీనమైన అభ్యర్థులపై కూడా స్పల్ప మెజార్టీతో గట్టెక్కిన నేతల జాబితాను సీఎం జగన్ తయారు చేయిస్తున్నారట.
ఈ జాబితాలో అనేక మంది సీనియర్ల పేర్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో బయటపడిన నేతల్లో మల్లాది విష్ణు, కిలారు రోశయ్య, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ తదితర నేతలు ఉన్నారు. వీరంతా కూడా వెయ్యి రెండువేల లోపు ఓట్లతోనే బయటికి పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈసారి వీరికి టిక్కెట్ ఇచ్చే అంశంపై జగన్ పునరాలోచిస్తారా? లేదా? అన్నది వేచిచూడాలి. ఈ పరిణామంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందనే టాక్ విన్పిస్తోంది.
తాజావార్తలు
-
Brahma Muhurat: “బ్రహ్మ ముహూర్తం”లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
-
Ajay Bhupathi: మహేష్ బాబు ఫ్యామిలీ హీరోతో సినిమా.. ఎందుకో చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి!
-
Demonetisation Fraud Case: పాత నోట్ల మార్పిడి కేసులో సంచలన తీర్పు.!
-
Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
-
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!