ముగిసిన రెండో రోజు ఆట… భారీ ఆధిక్యంలో భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. అయితే ఈరోజును 221/6 తో ప్రారంభించిన భారత జట్టు మయాంక్ అగర్వాల్(150) అక్షర్ పటేల్ (52) సహాయంతో 325 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు భారత బౌలర్లు భారీ షాక్ ఇచ్చారు, వచ్చిన బ్యాటర్ ను వచ్చినట్లు కుదురుకోనివ్వకుండా వెన్నకి పంపించారు. దాంతో ఆ జట్టు 62 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక కివీస్ బ్యాటింగ్ లో కైల్ జామీసన్(17), టామ్ లాథమ్(10) ఇద్దరే రెండంకెల స్కోర్ ను టచ్ చేసారు. అయితే భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీయగా… సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ ఒక్క వికెట్ పడగొట్టారు.
ఇక అనంతరం 263 పరుగులు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆట ముగిసే సమయం వరకు ఒక్క వికెట్ పడనివ్వలేదు . ఈ ఇన్నింగ్స్ లో మయాంక్ తో కలిసి ఓపెనర్ గా వచ్చిన పుజారా కొంచెం దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. దాంతో టీం ఇండియా ప్రస్తుతం 332 పరుగుల ఆధిక్యంతో ఉంది. అయితే ఈరోజు ముగిసే సమయం వరకు క్రీజులో ఉన్న మయాంక్(38), పుజారా(29) రేపు బ్యాటింగ్ కొనసాగిస్తారు.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!