విజయం సాధించిన భారత్… 2-1 తో ఆధిక్యంలోకి కోహ్లీసేన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లాండ్ తో జరిగిన నాల్గవ టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన ఈ చివరి రోజు ఆటలో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేసారు. ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కోహ్లీ(50), శార్దుల్(57) అర్ధశతకాలు చేయడంతో 191 పరుగులు చేసి మొదటి రోజే ఆల్ ఔట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆతిథ్య జట్టు 290 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ లో 99 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
అనంతరం… రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(46) పరుగులు చేయగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(127) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అలాగే దానికి పంత్(50), శార్దుల్(60) అర్ధశతకాలు తోడవడంతో 466 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది టీంఇండియా. దాంతో 367 పరుగుల భారీ లక్ష్యంతో నిన్న తమ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా 77 పరుగులు చేసి నాలుగో రోజు ఆటను ముగించింది.
Also Read
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
- Iran Hit List: ఇరాన్ హిట్లిస్ట్లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
ఇక నేడు చివరి రోజు ఆట ప్రారంభ సమయంలో విజయానికి 290 పరుగులు ఇంగ్లాండ్ జట్టుకు… 10 వికెట్లు భారత జట్టుకు కావాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరు అర్ధశతకాలు చేసి జట్టుకు విజయం వైపుకు తీసుకెళ్తుండగా శార్దుల్ మొదటి వికెట్ ను భారత్ కు అందించాడు. అనంతరం రెండో సెషన్ లో బుమ్రా, జడేజా బౌలింగ్ ధాటికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు పెవిలియన్ దారి పట్టారు. అయితే చివరి సెషన్ లో భారత్ కు రెండు వికెట్లు అవసరం ఉండగా ఉమేష్ యాదవ్ వారిని ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 210 పరుగులకే కుప్పకూలింది. దాంతో భారత్ 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ లో భారత్ 2-1 తో ఆధిక్యంలోకి వెళ్ళింది.
తాజావార్తలు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
-
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
-
Jani Master: శేఖర్ మాస్టర్తో గొడవ? మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ.. అసలు నిజం బయటపెట్టిన జానీ మాస్టర్!
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!