వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది జీఎస్టీ కౌన్సిల్ సమావేశం… వస్త్రాలపై ప్రస్తుతం జీఎస్టీ 5 శాతం ఉండగా.. దానిని 12 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది జీఎస్టీ కౌన్సిల్.. టెక్స్టైల్స్పై 5 శాతం నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్టీ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రస్తుతానికి దానిని వాయిదా వేసింది.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్రాలు వ్యతిరేకించాయి.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఉత్తరులు కూడా వెళ్లాయి.. ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలు వస్త్రాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును 12కి పెంచడాన్ని వ్యతిరేకించాయి..
Read Also: 50కే లిక్కర్..? ప్రతీ కుటుంబానికి 2 లక్షలు మిగులుతాయి..!
Also Read
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అధ్యక్షతన, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ యొక్క 46వ సమావేశం నిర్వహించారు.. వస్త్రాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే ప్రతిపాదనను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. మరోవైపు.. వస్త్రాలపై వస్తు, సేవల పన్ను పెంపునకు వ్యతిరేకంగా వ్యాపారులు చేస్తున్న నిరసనకు ఢిల్లీ ప్రభుత్వం మద్దతిస్తోందని, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని డిసెంబరు 30న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలపగా.. జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంపునకు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న నిరసన న్యాయమైనదేనని.. తమ ప్రభుత్వం పన్ను రేట్లను తక్కువగా ఉంచడానికి అనుకూలమని ప్రకటించారు.. మరోవైపు.. వస్త్రాలపై జీఎస్టీ పెంచితే.. రైతుల తరహాలో.. చేనేత కార్మికుల కూడా ఆందోళన చేస్తారని.. వారికి తాము అండగా ఉంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్రానికి లేఖ రాసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!