వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది జీఎస్టీ కౌన్సిల్ సమావేశం… వస్త్రాలపై ప్రస్తుతం జీఎస్టీ 5 శాతం ఉండగా.. దానిని 12 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది జీఎస్టీ కౌన్సిల్.. టెక్స్టైల్స్పై 5 శాతం నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్టీ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రస్తుతానికి దానిని వాయిదా వేసింది.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్రాలు వ్యతిరేకించాయి.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఉత్తరులు కూడా వెళ్లాయి.. ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలు వస్త్రాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును 12కి పెంచడాన్ని వ్యతిరేకించాయి..
Read Also: 50కే లిక్కర్..? ప్రతీ కుటుంబానికి 2 లక్షలు మిగులుతాయి..!
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అధ్యక్షతన, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ యొక్క 46వ సమావేశం నిర్వహించారు.. వస్త్రాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే ప్రతిపాదనను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. మరోవైపు.. వస్త్రాలపై వస్తు, సేవల పన్ను పెంపునకు వ్యతిరేకంగా వ్యాపారులు చేస్తున్న నిరసనకు ఢిల్లీ ప్రభుత్వం మద్దతిస్తోందని, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని డిసెంబరు 30న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలపగా.. జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంపునకు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న నిరసన న్యాయమైనదేనని.. తమ ప్రభుత్వం పన్ను రేట్లను తక్కువగా ఉంచడానికి అనుకూలమని ప్రకటించారు.. మరోవైపు.. వస్త్రాలపై జీఎస్టీ పెంచితే.. రైతుల తరహాలో.. చేనేత కార్మికుల కూడా ఆందోళన చేస్తారని.. వారికి తాము అండగా ఉంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్రానికి లేఖ రాసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!