వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది జీఎస్టీ కౌన్సిల్ సమావేశం… వస్త్రాలపై ప్రస్తుతం జీఎస్టీ 5 శాతం ఉండగా.. దానిని 12 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది జీఎస్టీ కౌన్సిల్.. టెక్స్టైల్స్పై 5 శాతం నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్టీ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రస్తుతానికి దానిని వాయిదా వేసింది.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్రాలు వ్యతిరేకించాయి.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఉత్తరులు కూడా వెళ్లాయి.. ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు వంటి రాష్ట్రాలు వస్త్రాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటును 12కి పెంచడాన్ని వ్యతిరేకించాయి..
Read Also: 50కే లిక్కర్..? ప్రతీ కుటుంబానికి 2 లక్షలు మిగులుతాయి..!
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అధ్యక్షతన, వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ యొక్క 46వ సమావేశం నిర్వహించారు.. వస్త్రాలపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే ప్రతిపాదనను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాలని నిర్ణయానికి వచ్చారు. మరోవైపు.. వస్త్రాలపై వస్తు, సేవల పన్ను పెంపునకు వ్యతిరేకంగా వ్యాపారులు చేస్తున్న నిరసనకు ఢిల్లీ ప్రభుత్వం మద్దతిస్తోందని, జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని డిసెంబరు 30న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలపగా.. జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంపునకు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న నిరసన న్యాయమైనదేనని.. తమ ప్రభుత్వం పన్ను రేట్లను తక్కువగా ఉంచడానికి అనుకూలమని ప్రకటించారు.. మరోవైపు.. వస్త్రాలపై జీఎస్టీ పెంచితే.. రైతుల తరహాలో.. చేనేత కార్మికుల కూడా ఆందోళన చేస్తారని.. వారికి తాము అండగా ఉంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్రానికి లేఖ రాసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!