రైల్వే శాఖ గుడ్న్యూస్.. తగ్గనున్న టికెట్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ.. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన రైళ్లు.. మళ్లీ పెట్టాలు ఎక్కడానికి చాలా సమయం పట్టింది.. క్రమంగా కొన్ని రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, కోవిడ్ సమయంలో రైలు టికెట్ల ధరలు కూడా పెరిగి ప్రయాణికులకు భారంగా మారాయి. అయితే, రైళ్లలో కరోనాకు ముందున్న చార్జీలను అమలుచేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. లాక్డౌన్లు, కోవిడ్ నిబంధనల కారణంగా రైల్వే శాఖ సర్వీసులను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే కాగా… కొంతకాలంగా స్పెషల్ ట్రైన్ల పేరుతో పరిమితంగా మాత్రమే సేవలను అందిస్తోంది. అలాగే ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, అనవసరపు ప్రయాణాలను తగ్గించడానికి పెంచిన చార్జీలను కూడా తగ్గించనున్నారు.. తక్షణమే పాత చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది రైల్వే బోర్డు.
మరోవైపు.. కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడిపిన రైల్వేశాఖ.. రైళ్ల నంబర్లకు ముందు సున్నా ఉండేలా చర్యలు తీసుకుంది.. అయితే ఇప్పుడు పాత నంబర్లతోనే రైళ్లు తిరగనున్నాయి.. ఇక, రైల్వే చార్జీలపై క్లారిటీ ఇచ్చారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, స్పెషల్ క్లాస్ ప్రయాణీకులకు కరోనాకు ముందున్న మాదిరిగానే చార్జీల్లో రాయితీలను పునరుద్ధరించనున్నట్టు వెల్లడించారు… రెండు మూడు నెలల్లో రైల్వే సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నట్టు పేర్కొన్నారు.. అయితే, జోన్ల పరిధిలో ఎప్పటి నుంచి రెగ్యులర్ సర్వీసులను నడపాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని అధికారులు చెబుతున్నారు.
Also Read
- Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్వెజ్ వివాదానికి బీజేపీ తెర!
- Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్వెజ్ వివాదానికి బీజేపీ తెర!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?